
పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లాలో గర్భవతి అయిన బిజెపి మద్దతుదారుని ఇంటిపై దాడి జరిగినప్పుడు ఆమె కడుపులో తన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ దాడిని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) గూండాలు చేశారని ఆమె తల్లి ఆరోపించారు. దిన్హటలో జరిగిన ఈ సంఘటనను ప్రతిపక్ష బిజెపి తీవ్రంగా ఖండించింది. స్థానిక తృణమూల్ అధినేత సహచరులు తమ ఇంట్లోకి బలవంతంగా చొరబడినప్పుడు తనను రక్షించడానికి జోక్యం చేసుకున్న తర్వాత తన ఎనిమిది నెలల గర్భవతి కుమార్తె పురబి బర్మాన్పై దాడి జరిగిందని తల్లి జయంతి బర్మాన్ ఆరోపించింది.
“వారు మా ఇంటిపై దాడి చేశారు. గూండాలు నాపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు నా కుమార్తె నన్ను రక్షించడానికి వచ్చింది. వారు ఆమె కడుపులో తన్నడంతో ఆమె నేలపై పడిపోయింది. ఆమె నొప్పితో కలత చెందింది” అని జయంతి విలేకరులతో పేర్కొన్నారు. పురబి ప్రసవం కోసం కుటుంబం దాచుకున్న రూ. 1 లక్షను దొంగిలించినట్లు ఆమె పేర్కొంది. దాడి చేసినవారు కుటుంబానికి తక్షణ వైద్య సహాయం అందకుండా అడ్డుకున్నారని కూడా ఆమె ఆరోపించింది.
“వారు మార్కెట్ వద్ద అంబులెన్స్ను ఆపారు. దానిని మా ఇంటికి రానివ్వలేదు. పోలీసులు వచ్చినప్పుడు, వారు మమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు,” అని ఆమె చెప్పారు. పురబి బర్మన్ పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంటూ బిజెపి అధికార టిఎంసిని “మహిళా వ్యతిరేకి” అని ఆరోపించింది, “ఇది అధికారంలో ఉండటానికి అత్యాచారాన్ని సాధనంగా ఉపయోగించే పార్టీ… లైంగిక హింసను సంస్థాగతీకరించిన పార్టీ” అని ఎక్స్ లో బిజెపి మండిపడింది.
బిజెపికి చెందిన కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్, అంబులెన్స్లో ఉన్న మహిళ వీడియోను ఎక్స్ లో పంచుకుంటూ, “తృణమూల్ కాంగ్రెస్ ఆశ్రయం కల్పించి, తినిపించిన అనాగరిక గూండాలు విప్పిన క్రూరత్వం లోతులను మీరు చూడండి!” అని రాశారు. ఎనిమిది నెలల గర్భవతి అయిన హిందూ మహిళను “బిజెపి సిద్ధాంతాన్ని నమ్మినందుకు కడుపులో దారుణంగా తన్నారని” ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా ఆయన విమర్శిస్తూ “ముఖ్యమంత్రి, స్వయంగా ఒక మహిళ, రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతున్నప్పటికీ మౌనంగా ఉన్నారు. ఇది సిగ్గుచేటు” అని ధ్వజమెత్తారు.
స్థానిక తృణమూల్ నాయకుడు బిషు ధర్ జరిగిన విధ్వంసాన్ని ఒప్పుకున్నా అందులో తన పార్టీ ప్రమేయాన్ని కొట్టిపారవేస్తూ రాజకీయ విభేదాల కారణంగా ప్రజలు కుటుంబంపై దాడి చేశారని పేర్కొన్నారు. “పేదల కోసం చాలా పనులు చేసిన మమతా బెనర్జీని సువేందు అధికారి దుర్భాషలాడుతుండడంతొ ప్రజలు అతనిపై కోపంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి” అంటూ నిస్సిగ్గుగా సమర్ధించారు. బిజెపి పంచాయతీ సభ్యులను “జాగ్రత్తగా ఉండండి” అని ధార్ హెచ్చరించారు,
“ఈ నాయకులు రాజకీయాలు చేయడం పేరుతో డబ్బును దోచుకుంటున్నారు. వారు దాని పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది” అని హెచ్చరించారు. ఈ వారం ప్రారంభంలో, కూచ్ బెహార్లో జరిగిన నిరసన కార్యక్రమంలో సువేందు అధికారి కాన్వాయ్పై దాడి జరిగింది, దీనిపై బిజెపి తృణమూల్ కాంగ్రెస్పై మండిపడింది.
అధికార పార్టీ ఆ ఆరోపణలను “చక్కగా రూపొందించిన డ్రామా” అని బిజెపి తోసిపుచ్చింది. బిజెపి పశ్చిమ బెంగాల్ యూనిట్ ఒక ట్వీట్లో, “బిజెపికి మద్దతు ఇచ్చినందుకు గర్భిణీ స్త్రీ కడుపులో తన్నారు. కూచ్ బెహార్లోని దిన్హటలో 8 నెలల గర్భిణీ స్త్రీపై టిఎంసి ప్రజలు దారుణంగా దాడి చేశారు. ఆమె చేసిన ఏకైక “నేరం”? బిజెపిని నమ్మడమా!!” అంటూ ప్రశ్నించింది.
More Stories
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము