
కేంద్ర పథకం కింద తెలంగాణలోని 9 మెడికల్ కళాశాలలకు 511 పిజి సీట్లు మంజూరయ్యాయని కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అను ప్రియా పటేల్ తెలిపారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ కు 92 సీట్లుకు మొదటి దశలో89 సీట్లకు రూ.7.47 కోట్లు విడుదల చేయగా, రెండో దశలో 3 సీట్లకు రూ.2.15 కోట్లు విడుదల చేసినట్లు తెలియజేశారు. లోక్ సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ సమాచారం ఇచ్చారు.
ఈ సందర్భంగా గ్రామీణ మెడికల్ కళాశాలల్లో సదుపాయాలను కల్పించడంతో పాటు సిబ్బంది కొరత లేకుండా చూడాలని ఎంపీ కోరారు. మెడికల్ కళాశాలలకు మరిన్ని ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలంటూ కోరారు.
ప్రధానంగా గ్రామీణ మెడికల్ కళాశాలల్లో డాక్టర్లు, సిబ్బంది, అధ్యాపకుల నియామకాలు, ల్యాబ్స్, లైబ్రరీలు, హాస్టళ్లు, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ టూల్స్ గ్రామీణ సేవలకు ప్రోత్సాహకాలు వంటి అంశాలపై వరంగల్ ఎంపీ వివరణ కోరారు. కొత్త మెడికల్ కళాశాలల్లో అవసరమైన మోలిక సదుపాయాలు 2023 నిబంధనల ప్రకారం తప్పనిసరి చేస్తూ అధ్యాపకుల హాజరు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
2024-25లో ఎన్హెచ్ ఎం కింద తెలంగాణకు రూ.67.16 కోట్లు, ప్రధాన్మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ మిషన్ కింద రూ. 208.82 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దూర ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు ప్రత్యేక భత్యాలు, నిపుణులకు గౌరవ వేతనాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.
More Stories
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం