
ఈ ఏడాది చివరి నాటికి క్యూఆర్ కోడ్తో ఈ-ఆధార్ సిస్టమ్ను దేశవ్యాప్తంగా అమల్లోకి తేవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రయత్నిస్తున్నది. దీనివల్ల ప్రజలు తమ గుర్తింపును డిజిటల్ స్కాన్ ద్వారా తనిఖీ చేసుకోవడానికి వీలవుతుంది. ఇది అమల్లోకి వస్తే, జిరాక్స్ కాపీలు, పత్రాలను ఉపయోగించవలసిన అవసరం ఉండదు. ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు సేవల కోసం క్యూఆర్ కోడ్తో తమ గుర్తింపును ధ్రువీకరించుకోవచ్చు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్ష ఆధార్ ఆథెంటికేషన్ మెషిన్స్ పని చేస్తున్నాయని యూఐడీఏఐ సీఈఓ భువనేశ్ కుమార్ చెప్పారు. వీటిలో దాదాపు 2,000 మెషిన్స్ను అప్గ్రేడ్ చేసినట్లు తెలిపారు. ఆధార్ మొబైల్ యాప్ను కూడా రీడిజైన్ చేస్తున్నారు. ఆధార్ హోల్డర్ తన పేరు, చిరునామా, జనన తేదీ, వంటి ప్రొఫైల్ అప్డేట్స్ను తన ఫోన్లోని ఈ యాప్ ద్వారానే చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు.
మరోవంక, దేశంలోని రెస్ట్టారెంట్లు, కేఫ్లు, ధాబాలు, రోడ్డుపక్కన ఆహారం విక్రయించే దుకాణాలు సహా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ (ఎఫ్బీవో)లు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ యాప్కు కనెక్ట్ చేసే క్యూఆర్ కోడ్తోపాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేదంటే తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) మార్గదర్శకాలు జారీ చేసింది.
More Stories
జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!