
బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణి పధకంలో జరిగిన భారీ కుంభకోణం కొత్త మలుపు తిరగబోతోంది. ఇప్పటి వరకు ఈ కుంభకోణంలో ఆ శాఖ అధికారులు, ఉద్యోగుల వరకే పరిమితం అయిన దర్యాప్తు, ఇక నుంచి అప్పట్లో ఆ శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పై దృష్టి సారించబోతున్నట్టు తెలుస్తున్నది.
త్వరలో ఆయనకు ఇడి నోటీసు జారీ చేయబోతున్నట్టు తెలిసింది. మొదట ఈ కుంభకోణం రూ.253 కోట్లుగా ‘కాగ్‘ తేల్చగా, దీనిపై తీగలాగితే అది వెయ్యికోట్ల పైగానే ఉన్నట్టు తేలిందని ఇడి అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ భారీ కుంభకోణం వెనుక బడాబాబు పాత్రపై నిగ్గుతేల్చేందుకు ఇడి అధికారులు రంగం సిద్ధం చేస్తోన్నట్టు ఈ వర్గాల సమాచారం.
ఇందులో భాగంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ పాత్రపై ఇడి ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అప్పట్లో మంత్రి వద్ద ఓఎస్డిగా పనిచేసిన కళ్యాణ్ నివాసంలో ఇడి నిర్వహించిన తనఖీలలో కీలకమైన ఆధారాలు లభించినట్లు ఈ వర్గాల సమాచారం. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా ఓఎస్డి రూ.వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడుతారా? అని ఇడి అనుమానానికి తనఖీలలో లభించిన సాక్షాధారాలు బలం చేకూర్చినట్టు తెలిసింది. దీంతో ఇడి అధికారులు త్వరలో తలసాని శ్రీనివాస్ యాదవ్కు నోటిసులు జారీ చేసి విచారణకు పిలువబోతున్నట్టు తెలిసింది.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత