
బిచ్చగాళ్లకు బిర్యాని, అడ్డకూలీలకు మద్యం, చదువుకున్న వారికైతే రూ. వెయ్యి నుంచి 4 వేలు, అదే మహిళలకైతే రూ.20 వేల నుంచి రూ.25 వేల దాకా ఇచ్చి వీర్యం, అండాల సేకరణ పేరుతో వికృత దందా జరుపుతున్నట్లు దిగ్బ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరుతో సికింద్రాబాద్లో ఈ దందా నడుపుతున్న డాక్టర్ నమ్రతతో సహ ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసుల విచారణలో ఇటువంటి దుశ్చర్యలు బయటపడుతున్నాయి.
సంతాన భాగ్యం లేక దాతల నుంచి వీర్యం, అండాల వంటివి కోరుకునేవారు ఆ దాతలు బాగా చదువుకున్నవారై, మంచి తెలివితేటలు కలిగినవారై ఉండాలని భావిస్తారు. కానీ ఈ దందా నడిపేవారు వారికి అంటగడుతున్నది బిచ్చగాళ్లు, అడ్డాకూలీల వీర్యాన్ని, అండాలను కావడం గమనార్హం.
నిబంధనల ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తులు, 21 నుంచి 55 ఏళ్లలోపు ఉన్నవారి నుంచి వారికి అన్నిరకాల వైద్యపరీక్షలూ నిర్వహించి, ఎలాంటి జన్యవ్యాధులు, అంటువ్యాధులు లేవని నిర్దారించుకున్న తర్వాత మాత్రమే వీర్యం సేకరించాలి.ఒక దాత నుంచి 25 సార్లు మాత్రమే వీర్యాన్ని సేకరించాలి. ఒక దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని ఒక మహిళకు ఒకసారి గర్భధారణకు మాత్రమే ఉపయోగించాలి. కానీ ఈ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టి ఒకే వ్యక్తి నుంచి వారానికొకసారి చొప్పున వీర్యం సేకరిస్తున్నట్లు వెల్లడైంది.
ఇండియన్ స్పెర్మ్ ఏజెంట్లు బిచ్చగాళ్లు, అడ్డాకూలీలను సంప్రదించి వారానికోసారి ఇక్కడకు వచ్చి తాము చెప్పినట్లు చేస్తే మందుతో పాటు బిర్యానీ ఆశచూపి, లేదంటే వాటికి సరిపడా రూ 500-1000 చేతిలో పెట్టి పంపేవారని సమాచారం.తమకు తెలిసిన మహిళలను తీసుకొస్తే వారి నుంచి అండాలు సేకరించేవారు. అది కొంచెం కష్టమైన పని కావడంతో మహిళలకు ప్రతిసారీ రూ.20 వేల నుంచి రూ.25 వేలు చెల్లించేవారని తెలిసింది.
More Stories
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు