
“మన సైనికుల సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని గట్టిగా చెబుతున్నా. ఈ ఆపరేషన్ తర్వాత పాక్ సైన్యం మనపై దాడికి దిగింది. పాక్ దాడులను మనం సమర్థంగా తిప్పికొట్టాం. పాక్పై మన సైనికులు మిసైళ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో పాకిస్థాన్లోని మిసైల్ లాంచింగ్ స్టేషన్ ధ్వంసమైంది” అని చెప్పారు.
“అనంతరం పాక్ మనపై జరిపిన దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. దాయాది దేశం నుంచి వచ్చిన అన్ని రకాల దాడులను మనం సమర్థంగా అడ్డుకున్నాం” అని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. పాక్ నుంచి వచ్చిన అన్ని దాడులను ఎదుర్కొన్నట్లు చెప్పారు. మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని చెబుతూ సైనిక సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదని రక్షణమంత్రి మండిపడ్డారు. సైనిక చర్యలపై ప్రశ్నలు వేసేటప్పుడు ఆచితూచి, ఆలోచించి ప్రశ్నించాలని విపక్షాలకు సూచించారు.
“ఆపరేషన్ సిందూర్ భారత సైన్యం సత్తాకు నిదర్శనం. భారత సైనికులకు నా సెల్యూట్. దేశ ప్రజలను రక్షించడం మా బాధ్యత. పాక్ పౌరులకు నష్టం కలగకుండా దాడులు చేశాం. 22 నిమిషాల్లో ఆపరేషన్ను పూర్తి చేశాం. 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం” అని రక్షణ మంత్రి తెలిపారు.
“పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు బలయ్యారు. ఆత్మరక్షణమే కోసమే ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. ఈ ఆపరేషన్తో అద్భుతమైన ఫలితాలను సాధించాం. ఉగ్రవాదులను అంతం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం” అని రక్షణ మంత్రి తెలిపారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.
More Stories
తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి వైపు చూస్తున్న నేపాల్
చరిత్రలో తెలంగాణ విమోచనకు అత్యంత ప్రాముఖ్యత
సుంకాలతో సగం రొయ్యల ఎగుమతులు.. రూ 25,000 కోట్ల నష్టం