నమో యాప్​ ద్వారా సలహాలు, సూచనలు పంపండి

నమో యాప్​ ద్వారా సలహాలు, సూచనలు పంపండి
ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటామని చెబుతూ దీన్ని ఎలా జరుపుకుంటారు? కొత్త ఆలోచనలను నమో యాప్‌ ద్వారా తనకు తెలియజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. భారత విద్యార్థులు అం  ప్రధాని మోదీ నెలవారీ కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’ 124 ఎసిసోడ్‌లో జాతినుద్దేశించి మాట్లాడుతూ ఇటీవల శుభాన్షు శుక్లా ఐఎస్‌ఎస్‌కు వెళ్లి.. భూమిపైకి చేరుకోగానే దేశమంతా ఆనందంతో, గర్వంతో నిండిపోయిందని పేర్కొన్నారు.
చంద్రయాన్‌-3ని విజయవంతంగా ల్యాండింగ్‌ చేసిన తర్వాత దేశంలో ఓ ప్రత్యేకమైన శాస్త్రీయ వాతావరణం ఏర్పడిందని తెలిపారు.  ప్రస్తుతం పిల్లలు సైతం స్పేస్‌సైన్స్‌పై ఆసక్తి చూపుతున్నారని పేర్కొంటూ ఇన్‌స్పైర్‌ మనక్‌ అభియాన్‌ పథకం విద్యార్థులను ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించే కార్యక్రమని తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి ఐదుగురిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

 

భారత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని కొనియాడుతూ ఇటీవలి ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో దేవేష్ పంకజ్, సందీప్ కూచి, దేవదత్ ప్రియదర్శి, ఉజ్వల్ కేసరీలు మెడల్స్ సాధించి దేశానికి గౌరవం తీసుకువచ్చారని ప్రశంసించారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో భారత విద్యార్థులు మూడు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాన్ని గెలిచారని చెప్పారు.

ముంబయిలో వచ్చే నెల జరుగబోయే ఆస్ట్రానమి, ఆస్ట్రోఫిజిక్స్‌ ఒలింపియాడ్ జరుగునుందని, ఇది అతిపెద్ద ఒలింపియాడ్‌ అవుతుందని చెప్పారు. భారత్‌ ఇప్పుడు ఒలింపిక్స్‌, ఒలింపియాడ్‌లో ముందుకెళ్తోందని పేర్కొన్నారు. యునెస్కో 12 మరాఠా కోటలను ప్రపంచవారసత్వ స్థలాలుగా గుర్తించిందని, ఇందులో 11 మహారాష్ట్రలో, ఒకటి తమిళనాడులో ఉన్నాయని తెలిపారు.

సల్హేర్ కోటలో మొఘలులు ఓడిపోయారని, ఛత్రపతి శివాజీ మహారాజ్ శివనేరిలో జన్మించారని, ఖండేరిలో సముద్రం మధ్యలో ఒక కోట ఉందని, శత్రువు ఆయనను ఆపాలని కోరుకున్నా శివాజీ మహారాజ్ అసాధ్యాన్ని సాధ్యం చేశాడని ప్రధాని వివరించారు.  ప్రతాప్‌గఢ్ కోటలో అఫ్జల్ ఖాన్ ఓడిపోగా, విజయదుర్గ్‌లో రహస్య సొరంగాలున్నాయని, ఛత్రపతి శివాజీ మహరాజ్‌ దూరదృష్టికి ఈ కోట సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పారు. తాను రాయ్‌గఢ్‌ సందర్శించిన సమయంలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహం ముందు నమస్కరించే అవకాశం తనకు లభించిందని తెలిపారు.

“మహారాష్ట్రలో 12 కోటలను ప్రపంచ వారసత్వ సంపదగా యూనెస్కో గుర్తించింది. కొన్నేళ్ల క్రితం రాయగఢ్‌కు వెళ్లాను. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అస్సాంలోని కజిరంగా నేషనల్‌పార్క్‌లో గడ్డి భూమి పక్షులకు నిలయం. అక్కడ 40 రకాలు ఉన్నాయి. టెక్నాలజీ బృందాలు వాటి కూతలు, ఏఐ ఆధారంగా లెక్కించాయి. టెక్నాలజీ, సెన్సివిటీ కలిస్తే ప్రతిదీ తేలిక అవుతుంది” అని మోదీ పేర్కొన్నారు.