జర్నలిస్టులు నిరాదారమైన వార్తల జోలికి వెళ్ళకండి

జర్నలిస్టులు నిరాదారమైన వార్తల జోలికి వెళ్ళకండి

జర్నలిస్టులు నిరాదారమైన వార్తల జోలికి వెళ్ళో ద్దని  ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మణ్ సూచించారు. ఆదివారంలో రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ  వార్త సేకరణలో ఎవరి వ్యక్తిత్వంను కించ పరిచే ప్రయత్నం చేయవద్దని   హితవు చెప్పారు. 

జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై ప్రభుత్వానికి విజ్ఞపణలు ఇచ్చామని పేర్కొంటూ చిన్న పత్రికల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.  అర్హతగల జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు అందేలా చూడాలని టీ జే ఏ రాష్ట్ర అధ్యక్షులు కదిరి వెంకట రమణ రావు ప్రభుతాన్ని కోరారు.  జర్నలిస్ట్ల రాయితీ జర్నలిస్టు రైల్వే పాస్ ల పునరుద్దరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నామని చెప్పారు. 

ఇప్పటికే అనేక సార్లు కేంద్ర మంత్రులు, ఎంపీల దృష్టికి తీసుకెళ్లినట్లు జాతీయ జర్నలిస్ట్ సంఘం(ఎన్ యూజే(ఐ). ఉపాధ్యక్షులు ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ తెలిపారు.  రాజకీయ వార్తలు రాసేటప్పుడు అలోచించి రాయాలని, అలాగే జర్నలిస్ట్లుగా పని చేసే పత్రికలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి(ఆర్ ఎన్ ఐ )పీఆర్  ఐ లాంటి అనుమతులు ఉన్నాయా లేదా చూసుకోవాలని సూచించారు.

అక్రిడిటేషన్ వున్నవారే జర్నలిస్టులు అనుకోవద్దని, కేంద్ర ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న అన్ని పత్రికల యాజమాన్యాలు, ఎడిటర్ లు ఇచ్చిన గుర్తింపు కార్డు వున్నవారు కూడా జర్నలిస్టులే అని స్పష్టం చేశారు.  సమాజంలో బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలపై పోరు చేసే ప్రతీ జర్నలిస్ట్ కు మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రిడిటేషన్ జిల్లా కమిటీలతో పాటు, జర్నలిస్టులకు సంబంధించిన అన్ని కమిటీలో టీ జే ఏకి ప్రభుత్వం ప్రాతినిద్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 

జర్నలిస్టులపై దాడులు సరైంది కాదని చెబుతూ ప్రభుత్వాలు ఈ విషయంలో కఠిన చట్టాలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై 9తీర్మాణాలు చేసి ఆమోదించారు.  టీ జే ఏ రాష్ట్ర కార్యదర్శి ఎం ఆర్. గౌరీ, ఉపాధ్యక్షులు ఖాసీమ్,  నిర్వాహక కార్యదర్శులు ఖలీల్ హమ్మద్, నసీర్ ఖాద్రి, కోశాధికారి మహమ్మద్ మహమూద్ అలీ, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నాగస్వామి తదితరులు పాల్గొన్నారు.