
ఆరు దశాబ్దాలకు పైగా సేవలందించిన మిగ్ -21 యుద్ధ విమానాలు సేవల నుండి వైదొలగనున్నాయి. 1963లో మొదటిసారిగా మిగ్ -21 విమానాలను వైమానిక దళంలోకి తీసుకుంది. చివరి మిగ్-21 బైసన్ జెట్స్ను దశలవారీగా తొలగించనున్నట్లు భారత వైమానిక దళం (ఐఎఎఫ్) సీనియర్ అధికారి మంగళవారం ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో చండీగఢ్ వైమానిక స్థావరంలో నిర్వహించే వీడ్కోలు కార్యక్రమంలో ఈ జెట్లకు విరమణ కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.
మిగ్-21 జెట్లను ప్రస్తుతం 23 స్క్వాడ్రాన్ నిర్వహిస్తోంది. వారిని పాంథర్స్ అని కూడా పిలుస్తారు. రష్యాలో తయారైన మిగ్ -21లను మొదటిసారి 1963లో ప్రయోగాత్మకంగా వైమానిక సేవల్లోకి తీసుకున్నారు. 2000 మధ్య కాలంలో సుఖోరు సు-30 ఎంకెఐలను తీసుకువచ్చే ఈ జెట్లు ఐఎఎఫ్కి వెన్నెముకగా నిలిచాయి. 1965, 1971లో పాకిస్తాన్తో యుద్ధాలు, 1999 కార్గిల్, 2019 బాలాకోట్ వైమానిక దాడులతో పాటు ఇటీవల ఆపరేషన్ సిందూర్ వంటి అనేక ప్రధాన ఘర్షణల్లో మిగ్ -21లు ప్రధాన పాత్ర పోషించాయి.
బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో అప్పటి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఈ యుద్ధవిమానాలను వినియోగించారు. మిగ్-21ల స్థానంలో దేశీయంగా అభివృద్ధి చేసిన తేజాస్ ఎంకెఐఎ యుద్ధ విమానాలను చేర్చనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయ. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానాలతో టేకోవర్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 36 మిగ్21 విమానాలు ఉన్నాయి.
1963లో తొలిసారి ఇండియా మిగ్ విమానాలను వాడడం మొదలుపెట్టింది. 2023 మిగ్21 విమానాన్ని చివరిసారి రాజస్థాన్లోని బార్మర్ నుంచి ఎగిరింది. 2025 చివరి నాటికి మిగ్21 విమానాలను తొలగించి, వాటి స్థానంలో లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మార్క్ 1ఏ విమానాలను వినియోగించనున్నట్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్ , ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ తెలిపారు.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా