
హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియలో ట్రంప్ కార్యవర్గం కీలక మార్పులు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. లాటరీ విధానాన్ని తొలగించి జీతం, సీనియార్టీ ఆధారంగా వీసాలు జారీ చేస్తే విధానం తీసుకు వస్తున్నారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రతిపాదనను శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యూలేటరీ అఫైర్స్ ఫర్ రివ్యూ కార్యాలయానికి పంపింది. హెచ్-1బీ వీసాలు జారీ పరిమితిని ఏటా కాంగ్రెస్ నిర్ణయిస్తుంది.
ప్రస్తుతం అది 85,000గా ఉన్నాయి. వీటిలో 20,000 వీసాలు మాస్టర్స్ డిగ్రీ చేసిన వర్కర్ల కోసం రిజర్వు చేశారు. ఎలాంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం జారీ చేస్తారు. ప్రస్తుతం ప్రాసెస్ను నిలిపివేసినట్లు శుక్రవారం యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. అందుకు కారణం 2026 వార్షిక పరిమితికి తగినన్ని దరఖాస్తులు రావడం. దీంతో 2026 ఏడాదికి లాటరీ విధానం బహుశా ఉండకపోవచ్చు.
లాటరీ విధానంలో వీసా దారులను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ తర్వాత ఆయా కంపెనీలు తమకు వచ్చిన వీసాల్లో, అక్టోబర్ నాటికి విధుల్లో చేరాల్సిన కార్మికుల దరఖాస్తులను సమర్పిస్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక సదరు పోస్టుకు ఆఫర్ చేస్తున్న వేతనం ఆధారంగా వీసాలు జారీ చేశారు. కంపెనీలు మరింత మంది ఉన్నత స్థాయి నిపుణులను నియమించుకొనేలా ప్రోత్సహించేందుకు ఈ విధానం అమలు చేసినట్లు తెలుస్తోంది.
దీంతోపాటు తక్కువ శ్రేణి జీతాలున్న పొజిషన్లలో విదేశీయుల నియామకాలను నియంత్రిచేందుకు ఉపయోగపడింది. నాడు ‘బై అమెరికన్, హైర్ అమెరికన్’ అనే కార్యక్రమం కింద దీన్ని నిర్వహించారు. 2021లో జో బైడెన్ అధికారంలోకి వచ్చాక దీన్ని పక్కనపెట్టారు. వాస్తవానికి ఏ కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకుండా లాటరీ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ పెద్ద పెద్ద కంపెనీలు అధిక దరఖాస్తులు చేసి ఎక్కవ వీసాలను దక్కించుకొంటున్నాయి.
ఈ లాటరీ విధానాన్ని తొలగించాలని ఈ ఏడాది జనవరిలో ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రొగ్రెస్ అనే మేధోమథన సంస్థ సూచించింది. జీతం, సీనియార్టీ ఆధారంగా వీసాలు జారీ చేస్తే వాటి ఆర్థిక విలువ 88 శాతం పెరుగుతుందని తెలిపింది.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక