
కోచ్ ఫ్యాక్టరీతో 3 వేల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తామని, తెలంగాణలోని 40 వేల రైల్వే స్టేషన్లను ఆధునికరిస్తున్నాం అని తెలియజేశారు. వరంగల్ కు ఎయిర్ పోర్టు కూడా ఇప్పటికే రావాల్సి ఉందని, ఎయిర్ పోర్టుకు భూములివ్వాలని గతంలో మాజీ సిఎం కెసిఆర్ ను కోరామని చెప్పారు. భూసేకరణ గురించి ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నామని, ఎంత త్వరగా భూములిస్తే అంత త్వరగా ఎయిర్ పోర్టు పూర్తవుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా, జోధ్పూర్ (భగత్- కీ -కోఠి) నూతన ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, . కిషన్ రెడ్డి జెండా ఊపి కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ హైదరాబాద్ నుండి జోధ్పూర్కు రోజువారీ రైలు నడపడం హైదరాబాద్లో నివసిస్తున్న రాజస్థానీ సమాజం చిరకాల స్వప్నమని చెప్పారు.
గతంలో పరిమితుల కారణంగా రైలును ప్రారంభించలేకపోయామని తెలిపారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా రైలు మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరిగాయని, కొత్త ట్రాక్ల నిర్మాణం, కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణం, సామర్థ్యం పెరగడం వల్ల హైదరాబాద్ నుండి జోధ్పూర్కు ఈ ప్రత్యక్ష రోజువారీ రైలు నడపడానికి వీలు కలిగిందని చెప్పారు.
ఈ నూతన రోజువారీ రైలు రిజర్వ్, అన్ రిజర్వ్ విభాగాల ప్రజల అవసరాలను తీరుస్తూ హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న దేశంలోని మధ్య, వాయువ్య రాష్ట్రాల ప్రజలు తమ స్వస్థలాలకు ప్రయాణించడానికి ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులు , సెలవుల్లో విరివిగా ప్రయాణించేవారికి, ప్రత్యేక పర్యటనలకు చేసే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.
వాణిజ్యం, వాణిజ్య మార్గాలను పెంచడంతో పాటు పర్యాటకం, తీర్థయాత్రలను ప్రోత్సహించడంలో కూడా ఈ రైలు సహాయపడుతుంది. రెగ్యులర్ డైలీ రైలు సర్వీసులు కాచిగూడ -భగత్ కీ కోఠి (17605) ఆదివారం నుండి అమలులోకి వస్తుంది. భగత్ కి కోఠి – కాచిగూడ (17606) రైలు ఈ నెల 22 నుండి అమలులోకి వస్తుంది.
More Stories
పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా
నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త శ్లాబులు
ఎల్టీటీఈ పునరుద్ధరణకు శ్రీలంక మహిళ ప్రయత్నం