
2008లో గురుగ్రామ్లోని షికోపూర్లో జరిగిన 3.53 ఎకరాల భూ ఒప్పందంలో మనీలాండరింగ్ దర్యాప్తుకు సంబంధించి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయనపై అభియోగాలు మోపింది. క్రిమినల్ కేసులో వాద్రాపై దర్యాప్తు సంస్థ ఫిర్యాదు దాఖలు చేయడం ఇదే మొదటిసారి.
ఏప్రిల్లో ఈ కేసులో మూడు రోజుల పాటు వాద్రాను విచారించిన ఈడీ ఇది మొదటి చార్జిషీట్. హర్యానాలోని గురుగ్రామ్ జిల్లా షికోపూర్లో రూ. 7.5 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసినప్పుడు వాద్రా డైరెక్టర్ గా ఉన్న రెండు సంస్థల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కటి రూ. 1 లక్ష మాత్రమే ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. పైన పేర్కొన్న వ్యక్తులు ఈ కేసులో దర్యాప్తును ప్రస్తావించారు.
వాణిజ్య కార్యకలాపాల కోసం వాద్రా సంస్థ భూమిని అభివృద్ధి చేయడానికి దరఖాస్తు చేసుకున్నట్లు, హర్యానా ప్రభుత్వం నాలుగు రోజుల్లో లైసెన్స్ను ఆమోదించిందని చెప్పారు. వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఎటువంటి చెల్లింపు లేకుండా భూమిని కొనుగోలు చేసిందని చెప్పారు.
ఈ కొనుగోలుకు చెక్కు జారీ చేయలేదని, మరో వాద్రా కంపెనీ స్కై లైట్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ చెక్కు జారీ చేసిందని ఓ అధికారి తెలిపారు. “…ఈ చెక్కును నగదుగా మార్చుకోవడానికి బ్యాంకుకు ఎప్పుడూ సమర్పించలేదు” అని ఆయన పేర్కొన్నారు. పైగా, ఆ భూమిని నాలుగేళ్ల తర్వాత డీఎల్ఎఫ్ కంపెనీకి సుమారు 58 కోట్లకు, ఎటువంటి డెవలప్మెంట్ చేపట్టకుండానే ఎక్కువ ధరకు ఆ భూమిని అమ్మేశారు.
అక్రమ రీతిలో రాబర్ట్ వరద్రా సుమారు 50 కోట్లు లాభం పొందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో 18 గంటల పాటు రాబర్ట్ వద్రాను ఈడీ విచారించింది. ఆ సమయంలో హర్యానాలో భూపేంద్ర సింగ్ హుడా అధికారంలో ఉన్నారు.
2012 అక్టోబర్లో హర్యానా ల్యాండ్ కన్సాలిడేషన్ అండ్ ల్యాండ్ రికార్డ్స్-కమ్-ఇన్స్పెక్టర్ -జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన ఐఎఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ఈ ఒప్పందం రాష్ట్ర ఏకీకరణ చట్టం, సంబంధిత కొన్ని నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఈ భూ ఒప్పందాన్ని రద్దు చేశారు. దీంతో ఈ ఒప్పందం వివాదాస్పదమైంది. రాజస్తాన్ బికనీర్ భూఒప్పందం, యుకెకి చెందిన ఆయుధాల విక్రేత సంజరు భండారీకి సంబంధించిన కేసుల్లో కూడా ఈడి వాద్రాను విచారిస్తోంది.
More Stories
జీఎస్టీ సంస్కరణలతో తగ్గనున్న ఆహార వస్తువుల ధరలు
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు
హెచ్-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తం