
ఐటీ రంగంలో విజయం సాధించడానికి ఆంగ్లం ఎంత ముఖ్యమో, దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ నేర్చుకోవడం వల్ల కూడా అంతే ప్రయోజనం ఉంటుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ దక్షిణ భారతీయ సినిమాల్లో 31 శాతం హిందీ డబ్బింగ్ ద్వారానే ఆదాయం వస్తుందని గుర్తు చేశారు.
వ్యాపారానికి హిందీ అవసరమైనప్పుడు, నేర్చుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. తన సినిమాలో “ఏ మేరా జహా” అనే హిందీ పాట పెట్టడానికి గల కారణాన్ని వివరిస్తూ మాతృభాష తెలుగు అయినప్పటికీ, హిందీ దేశ భాష అని చెప్పడానికే అలా చేశానని తెలిపారు. హిందీని ప్రేమించాలని, దానిని స్వీకరించాలని, దానిని ప్రోత్సహించేందుకు మనందరం కలిసి సంకల్పించుకుందామని పిలుపునిచ్చారు.
హిందీని వ్యతిరేకించడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందని పేర్కొంటూ మనం విదేశీ భాషలను నేర్చుకోగలిగితే, హిందీ గురించి ఎందుకు వెనుకాడాలని ప్రశ్నించారు. హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదని, మరింత బలపడటమని పవన్ స్పష్టం చేశారు. మరో భాషను అంగీకరించడం ఓటమి కాదని, కలిసి ప్రయాణించడమని ఉద్ఘాటించారు.
విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి వంటి రంగాల్లో భాషా అవధులు చెరిగిపోతున్న ఈ సమయంలో హిందీని వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమేనని పవన్ స్పష్టం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి మాతృభాషలపై గౌరవం ఉండాలని చెబుతూనే, హిందీని పెద్దమ్మ భాషగా అభివర్ణించారు. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉండగా, దేశ సరిహద్దులు దాటితే హిందీ రాజ్య భాషగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రపంచం విడిపోవడానికి కారణాలు వెతుకుతుంటే, భారతదేశం మాత్రం ఒకే భాషతో ఏకం కావాలని చూస్తోందని, అది హిందీతో సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఒక బెంగాలీ గీతం జాతీయ గీతమైందని, ఒక పంజాబీ దేశం కోసం పోరాడారని, రాజస్థాన్కు చెందిన రాణప్రతాప్ శౌర్యానికి చిహ్నంగా నిలిచారని, తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ అయ్యారని, మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన వ్యక్తి రూపొందించిన మువ్వన్నెల జెండా దేశానికి తిరంగా అయిందని ఉప ముఖ్యమంత్రి పవన్ గుర్తు చేశారు.
ఒక బెంగాలీ గీతం జాతీయ గీతమైందని, ఒక పంజాబీ దేశం కోసం పోరాడారని, రాజస్థాన్కు చెందిన రాణప్రతాప్ శౌర్యానికి చిహ్నంగా నిలిచారని, తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ అయ్యారని, మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన వ్యక్తి రూపొందించిన మువ్వన్నెల జెండా దేశానికి తిరంగా అయిందని ఉప ముఖ్యమంత్రి పవన్ గుర్తు చేశారు.
ప్రతి భాషా జీవ భాష, మాతృ భాష అయినప్పటికీ, రాజ్య భాష మాత్రం హిందీయేనని స్పష్టం చేశారు. తాను వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో హిందీని ఉపయోగిస్తానని తెలిపారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాంను గుర్తుచేసుకుంటూ భాష హృదయాలను అనుసంధానించాలని సూచించారు. ఈ దృక్కోణం నుండి హిందీని చూద్దామని కలాం అన్న మాటలను పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, ప్రొఫెసర్ మాణిక్యాంబ, ప్రొఫెసర్ అనంత్ కృష్ణన్ తదితరులు ప్రసంగించారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం