
“సిద్ధరామయ్యను తొలగించి డీకే శివకుమార్ను సీఎంని చేయాలి. ఆయన పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ అభివృద్ధి అందరూ చూశారు. అందుకే మోజారిటీ ప్రజలు ఆయన్నే సీఎంగా కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి మార్పు అంశం గురించి నేను సుర్జేవాలాతో మాట్లాడతాను” అంటూ స్పష్టం చేశారు.
పైగా, ఇప్పుడు మార్పు జరగకపోతే 2028లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకోలేదని ఖరాఖండిగా చెప్పారు. ప్రస్తుతం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సీఎం మార్పు చాలా అవసరం అంటూ చెప్పుకొచ్చారు. అయితే, అటువంటి వ్యవహారాలపై నిర్ణయం తీసుకోవలసింది పార్టీ అధిష్టానమని పేర్కొంటూఎవరూ అనవసర సమస్యను సృష్టించకూడదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం స్పష్టం చేశారు.
“హైకమాండ్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఆ విషయాన్ని హైకమాండ్కే వదిలిపెట్టాము. తదుపరి కార్యాచరణను తీసుకునే అధికారం దానికే ఉంది. అనవసరంగా సమస్యను సృష్టించవద్దు” అని కోరారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్న ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ ఎద్దేవా చేసింది. ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోకా స్పందిస్తూ ఖర్గే కాకపోతే పార్టీ హైకమాండ్ ఎవరని ప్రశ్నంచారు. మీరు కాకపోతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలలో ఎవరో ఒకరా లేక ఓ ఇంటిపేరుతో కూడిన కనిపించని కమిటీనా అని ఎక్స్లో ఆయన ఖర్గేని ప్రశ్నించారు.
మరోవంక, ముఖ్యమంత్రి సిద్దరామయ్య సహితం ఈ విషయమై స్పష్టత ఇవ్వడం కోసం తనకు, ఉపముఖ్యమంత్రికి మధ్య ఎటువంటి అగాధం లేదని, పార్టీ పటిష్టంగా ఉందని తెలిపారు. హోంమంత్రి హెచ్ కె పటేల్ సహితం సూర్జేవాలా పర్యటన నాయకత్వం మార్పు గురించి కాదని చెప్పుకొచ్చారు. దానితో ప్రభుత్వంలో ఎలాంటి నాయకత్వ మార్పు ఉండబోదని డీకే శివకుమార్ సహితం చెప్పారు. తాను నాయకత్వ మార్పును కోరుకోవడం లేదని, ముఖ్యమంత్రి పదవి కోసం తనకు ఏ ఎమ్మెల్యే మద్దతు అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం తమ దృష్టంతా స్థానిక సంస్థల ఎన్నికలు, 2028లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఉందని చెప్పుకొచ్చారు.
.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు