న్యూదిల్లీ నెట్వర్క్కు అఫ్గానిస్థాన్ వేదికగా మారిందనీ, అఫ్గాన్ వాసులతో కలిసి పాక్లో దాడులు చేస్తోందని ఆరోపించారు. భారత్ పోషిస్తున్న ఉగ్రవాదులకు అఫ్గానిస్థాన్ వేదిక ఇవ్వకూడదని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.మరోవంక, జూన్ 28 శనివారం రోజు వజీరిస్థాన్ లో జరిగిన ఆత్మాహుతి దాడి వెనక భారత్ హస్తం ఉందని అసిమ్ మునీర్ నోరు పారేసుకున్నారు.
కాగా, వజీరిస్థాన్లో జరిగిన ఆత్మాహుతి దాడి వెనక భారత్ హస్తం ఉందన్న పాకిస్థాన్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవన్నీ తప్పుడు, నిరాధార ఆరోపణలని స్పష్టం చేసింది. ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భారత్పై నిందలు వేస్తూ పాక్ సైన్యం చేసిన అధికారిక ప్రకటన తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ ప్రకటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని భారత విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది.
800 కిలోలు ఉన్న భారీ పేలుడు పదార్థాలున్న వాహనంతో వజీరిస్థాన్లో ఓ ఉగ్రవాది సైనిక కాన్వాయ్పైకి దూసుకెళ్లి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 13 మంది పాక్ సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పౌరులు, ప్రభుత్వాధికారులతో సహా 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పాకిస్థాన్ లోని తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపునకు చెందిన ఉసూద్ -అల్ -హర్బ్ ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆ దాడి వెనుక భారత్ హస్తం ఉందని పాక్ నిరాధార ఆరోపణలు చేసింది.

More Stories
గల్లంతైన పైలట్ను రక్షించాం.. రెస్క్యూ విమానం కూల్చివేత
హోర్ముజ్పై 48 గంటల్లో ఇరాన్ దారికి రాకపోతే బీభత్సం
డెల్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇరాన్