
ఇటీవలే (జూన్ 24, 25) నెదర్లాండ్స్లో జరిగిన నాటో కూటమి సదస్సులో తీసుకున్న సంచలన నిర్ణయాలను చూస్తుంటే అమెరికా సారథ్యంలోని నాటో కూటమి, వ్లాదిమిర్ పుతిన్ సారథ్యంలోని రష్యాల మధ్య మరోసారి `ప్రచ్ఛన్న యుద్ధం’కు సంకేతాలే కనిపిస్తున్నాయి. యుక్రెయిన్ విషయంలో రాజీలేకుండా రష్యా ముందుకు సాగుతుండటాన్ని చూసి ఆందోళన చెందుతున్న నాటో దేశాలు, ఇక నుంచి తమ జీడీపీలో 5 శాతాన్ని రక్షణ వ్యయాలకు కేటాయిస్తామని ప్రకటించాయి.
రష్యాను ఎదుర్కొనేందుకు సైనిక శక్తి నుంచి సైబర్ శక్తి దాకా అన్నీ బలోపేతం చేస్తామని నాటో తీర్మానించింది రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులు వేసింది. దీని తర్వాత అంతర్జాతీయ స్థాయి కలిగిన సామాజిక, ఆర్థిక సంస్థలు అమెరికా కనుసన్నల్లో పనిచేయసాగాయి. కొన్ని దేశాలను ఆర్థిక సాయంతో, ఇంకొన్ని దేశాలను సైనిక సాయంతో, మరికొన్ని దేశాలను అంతర్జాతీయ సంస్థల ద్వారా తన పక్షాన ఉండేలా అమెరికా మార్చుకుంది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ (అవిభక్త రష్యా) అనేది అమెరికాకు పెద్ద సవాల్గా కనిపించింది. దాన్ని ఎదుర్కొనేందుకు పశ్చిమ ఐరోపా దేశాలను చేరదీసి, వాటికి అమెరికా పెద్దఎత్తున సైనిక సాయాన్ని అందించింది. ఈ పరిణామాలను గుర్తించి అప్రమత్తమైన సోవియట్ యూనియన్ తన మిత్ర దేశాల సంఖ్యను పెంచుకోసాగింది. నాటోకు వ్యతిరేకంగా తన మిత్ర దేశాలకు సైనిక సాయాన్ని పెంచింది.
More Stories
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
ఇరాన్పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్