
కాగా, ఈ-ఓటింగ్ కోసం నమోదు చేసుకోవాలనుకునే ఓటర్లు తమ మొబైల్లో e-SECBHR యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ తెలిపారు. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఓటర్ల జాబితాలో ఇప్పటికే పేరు నమోదు చేసుకున్న ఫోన్ నంబర్కు ఈ యాప్ను లింక్ చేయాలని అన్నారు.
మరోవైపు ఇప్పటికే 10,000 మంది ఓటర్లు యాప్లో సైన్ అప్ చేసుకున్నారని దీపక్ ప్రసాద్ తెలిపారు. సుమారు 50,000 మంది పోలింగ్ బూత్లకు వెళ్లకుండా వెబ్సైట్ ద్వారా కూడా ఓటు వేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. బ్లాక్చెయిన్ ప్లాట్ఫామ్, ఫేస్ మ్యాచ్, స్కానింగ్ వంటి వ్యవస్థలతో కూడిన మొబైల్ యాప్ ద్వారా ఓటింగ్ విధానం ట్యాంపర్ ప్రూఫ్గా పని చేస్తుందని వివరించారు. అయితే త్వరలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ఓటింగ్కు అనుమతి ఇస్తారో లేదో అన్నది ఆయన స్పష్టం చేయలేదు.
More Stories
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు