
జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చే విధివిధానాలను వెంటనే ప్రకటించి, అర్హులైన అందరికీ వీలైనంత త్వరగా కార్డులు ఇవ్వాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ డిమాండ్ చేశారు. అక్రిడేషన్ పాలసీని సరళీకృతం చేయాలని సూచించారు. ఏడాది నుంచి ఈ అంశాన్ని తేల్చకపోవడం సమంజసం కాదని విమర్శించారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పటిష్ఠమైన ఇన్సూరెన్స్, ఆసుపత్రులలో ఉచిత చికిత్స, ఆరోగ్య కార్డులు తదితర అంశాలతో పాటు తెలంగాణ పాత్రికేయుల సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి త్వరలో వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. రైళ్లు, విమానాల టికెట్లలో జర్నలిస్టులకు రాయితీ ఇవ్వాలని, టోల్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని తాము పోరాడుతున్నట్లు తెలిపారు.
సెప్టెంబరులో ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించి ఈ అంశాలపై ప్రధాని మోదీకి విన్నవిస్తామని చెప్పారు. జర్నలిజం ప్రింట్ మీడియా నుంచి మొదలై వివిధ రూపాలకు విస్తరించినందున పాత చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ ప్రక్రియలో పాత్రికేయులకూ భాగస్వామ్యం కల్పించాలని కోరారు.
ఎమ్మెల్యేలు, మంత్రులు, గెజిటెడ్ అధికారులకు కల్పించే సౌకర్యాలను జర్నలిస్టులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేలు, మంత్రులు, గెజిటెడ్ అధికారులకు కల్పించే సౌకర్యాలను జర్నలిస్టులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులు నిష్పక్షపాతంగా ఉంటేనే సమాజంలో వారిపట్ల గౌరవం పెరుగుతుందని పేర్కొంటూ వారు దేశహితం కోసమే పని చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర కీలకమని చెబుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తున్నా సామాజిక అంశాల్లో జర్నలిస్టులు వెనకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారిలో ఐక్యత లేకపోవడమే అందుకు కారణమని చెబుతూ ఆర్థిక భద్రత, ఉద్యోగ భద్రత తదితర అంశాల్లో వెనకబడి జర్నలిస్టులు వెనకబడి ఉన్నారని, దేశమంతా ఇదే స్థితి ఉందని తెలిపారు. వారి పక్షాన పోరాడేందుకే వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ఆవిష్కరించిందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని 16 రాష్ట్రాల్లో పాత్రికేయుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, దేశంలోని అన్ని రాష్ట్రాలలో తమ సభ్యులు ఉన్నారని సంజయ్ ఉపాధ్యాయ తెలిపారు.
జాతీయ స్థాయిలో బీఎంఎస్ కు అనుబంధంగా పని చేస్తున్నామని, త్వరలో నేపాల్ కు కూడా విస్తరించబోతున్నట్లు వెల్లడించారు. కాగా, జాతీయ విద్యావిధానం-2020, మీడియా పాత్ర అనే అంశంపై డబ్ల్యూజేఐ ఆధ్వర్యంలో శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు డబ్ల్యూజేఐ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నందనం కృపాకర్ తెలిపారు. సాయంత్రం ఉత్తమ జర్నలిస్టులకు పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. డబ్ల్యూజేఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అనిల్ దేశాయ్, సిద్ధిరెడ్డి శ్రీనివాసరెడ్డి , కార్యదర్శి క్రాంతి, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు