
గాజాలో పాలస్తీనా వాసులకు వీరు ఎటువంటి ఆధారం మిగల్చలేదన, అందుకే ఈ స్థాయిలో దాడులు చేయాలని పిలుపునిచ్చాడు. గతంలో అల్-అవ్లాకీ అమెరికాలో యూదులపై జరిగిన దాడులను పొగుడుతూ మాట్లాడాడు. వారికి ఎక్కడా సురక్షిత ప్రదేశమంటూ లేకుండా చేయాలన్నాడు. అల్ఖైదా అరేబియన్ పెనున్సులా సంస్థ యెమెన్ కేంద్రంగా పనిచేస్తోంది.
గతంలో ఇది సౌదీ, యెమెన్లో వేర్వేరుగా పనిచేసేది. అల్ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అత్యంత ప్రమాదకర గ్రూపుగా అల్ఖైదా అరేబియన్ పెనున్సులా అవతరించింది. సాద్ బిన్ అతేఫ్ అల్-అవ్లాకీ ఆ గ్రూపు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. అతడు గతంలో పలుమార్లు అమెరికాపై దాడికి పిలుపునిచ్చాడు. అతడి తల పైనా రూ.50 కోట్ల రివార్డు ఉంది.
అల్ఖైదాలో ఈ పెనెన్సులా విభాగమే అత్యంత చురుగ్గా పనిచేస్తోంది. దీనికితోడు గతంలో ఇది ప్రమాదకర దాడులు నిర్వహించింది. అమెరికా, ఐరోపా దేశాల్లోని లక్ష్యాలపై ఇది గురిపెట్టింది. 2009 అండర్వేర్ బాంబర్ కుట్ర, 2015లో చార్లె హెబ్డోపై దాడి దీని పనే. దీంతో అమెరికా విదేశాంగశాఖ దీనిని ఉగ్రజాబితాలో చేర్చింది.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?