
* పంజాబ్ లో మరో గూఢచారి అరెస్ట్
ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్ము కశ్మీర్ ప్రభుత్వం వేటు వేసింది. పోలీస్ కానిస్టేబుల్ ఇష్ఫాక్ నసీర్, స్కూల్ టీచర్ అజాజ్ అహ్మద్ , ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్ఖాన్.. ఈ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పంజాబ్ కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు, తార్న్తరన్ పోలీసులు సంయుక్తంగా గగన్దీప్ సింగ్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. నిందితుడికి ఖలిస్థాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లా, పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని పంజాబ్ డీజీపీ పేర్కొన్నారు. గగన్దీప్ సింగ్కు ఖలిస్థాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లాకు ఐదేళ్లుగా పరిచయం ఉందని తేలిందని వివరించారు.
గగన్ దీప్ సింగ్ను పాక్ నిఘా వర్గాలకు గోపాల్ సింగ్ పరిచయం చేశాడని పేర్కొన్నారు. గగన్దీప్ భారత బలగాల మోహరింపులు, కీలకమైన ప్రదేశాలను పాక్ నిఘా సంస్థలకు అందించినట్లు చెప్పారు. ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తోందని డీజీపీ వివరించారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు