కేసీఆర్ మంత్రుల్లో మహిళలు లేనప్పుడు కవిత ప్రశ్నించలేదే!

కేసీఆర్ మంత్రుల్లో మహిళలు లేనప్పుడు కవిత ప్రశ్నించలేదే!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొలి విడతలో ఒక్క మహిళకు కూడా మంత్రి వదవీ ఇవ్వలేదని,  ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్‌ను ఎందుకు ప్రశ్నించలేని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు లదీశారు. గజ్వేల్ పట్టణంలో అహల్యాబాయి హెూల్కర్ విగ్రహాన్ని రఘునందన్ రావు ఆవిష్కరించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం నుంచి చంద్రపూర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు.
 
మూడువందల సంవత్సరాల క్రితం స్త్రీల హక్కుల కోసం పోరాడిన అహల్యాబాయి హెూల్కర్ విగ్రహాన్ని గజ్వేల్‌లో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఆ రోజుల్లోనే కులాంతర వివాహం కోసం ఆమె పోరాడారని చెప్పారు.  బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన తప్పిదాల గురించి మాట్లాడని కవిత ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 
కవిత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై పోరాడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కవితకు సామాజిక తెలంగాణ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. “జనాభా దావాస ప్రకారం మంత్రి పదవులు ఇస్తామని చెప్పారు. మీరు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో 50 శాతానికి పైగా బీసీలు ఉన్నారు. ఏ రోజు కూడా బీసీలకు సగం మంత్రి పదవులు ఇవ్వమని కల్వకుంట్ల కవిత కేసీఆర్‌ను అడగలేదు” అని విమరసంచారు. 
 
“బీజేపీ స్పృశించినటువంటి అంశం లేదు. ఎవరూ అడగకుండా రైతులకు మేలు చేసే నిర్ణయాలను బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. కేబినెట్ నిర్ణయం తీసుకొని లక్షల కోట్ల రూపాయలు రైతన్నకి బీజేపీ ప్రభుత్వం అందిస్తుంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన కొద్ది నెలలకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. మోదీ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ శాఖలకు బీసీ మంత్రులు ఉన్నారు” అని రఘునందన్ రావు గుర్తు చేశారు.
“కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ మేధావులు మర్చిపోయినటువంటి చరిత్రను బీజేపీ పరిచయం చేస్తుంది. బీజేపీని విమర్శిస్తే ఊరుకునేది లేదు. వందమంది మోదీలు వచ్చిన ఆర్టికల్ 370 రద్దు కాదని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఒక్క మోదీ తలుచుకుంటేనే ఆర్టికల్ 370 రద్దు చేశారు” అని తెలిపారు. 

“సామాజిక న్యాయం గురించి బీసీ మద్దతు గురించి 12 మంది కేబినెట్‌లో మద్దతిచ్చారు. భారతీయ ప్రజలకు ఏది లాభం జరుగుతుందో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారు. పదవి లేకపోతే వేరే కుంపటి పెట్టే వాళ్లు మా పార్టీలో ఎవరూ లేరు. మీ వారసత్వ పంచాయతీ కోసం మేం పట్టించుకోం. మోదీ గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదు” అని బీజేపీ ఎంపీ హెచ్చరించారు.