
లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు, హఫీజ్ సయీద్ కుమారుడు, ఉగ్రవాదిగా భారత్ ప్రకటించిన తల్హా సయీద్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాడు. పహల్గాం ఉగ్రదాడికి తాను సూత్రధారినని తనను భారత్ నిందిస్తున్నదని, యావత్ ప్రపంచంలో తన పేరు ఇప్పుడు మార్మోగుతున్నదని ర్యాలీలో మాట్లాడుతూ కసూరీ చెప్పాడు. భారత్ ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో 32వ స్థానంలో ఉన్న తల్హా సయీద్ ఇదే ర్యాలీలో ప్రసంగిస్తూ జిహాదీ నినాదాలు చేశాడు.
2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్కు పోటీ చేసి సయీద్ ఓటమిపాలయ్యాడు. నిషిద్ధ లష్కరే తాయిబాకు రాజకీయ వేదికగా పీఎంఎంఎల్ ఉపయోగపడుతున్నది. గత నెల 22న జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ హస్తం ఉన్నట్లు తెలిసింది. ఈ మారణహోమానికి ప్రధాన సూత్రధారిగా సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీదే అని నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రదాడికి అతడే ప్లాన్ చేసినట్లు సమాచారం.
పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందిన ఖలీద్ను కరుడుగట్టిన ఉగ్రవాదిగా ఎన్ఐఏ పేర్కొంటోంది. ప్రస్తుతం అతడు ఇస్లామాబాద్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు చేపడుతున్నట్లు సమాచారం. ఐఎస్ఐ, పాక్ ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఖలీద్తోపాటు ఈ దాడికి ప్లాన్ చేసిన వారిలో పీవోకేకి చెందిన ఇద్దరు వ్యక్తులు హస్తం ఉందని నిఘా సంస్థలు గుర్తించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
More Stories
పాక్ సైనికుల దుస్తులతో ఆఫ్ఘన్ లో తాలిబన్ల ప్రదర్శనలు
కెనడాలోని కపిల్ శర్మ ‘కాప్స్ కేఫ్’పై మళ్లీ కాల్పులు
లండన్లోని ట్రాఫాల్గర్ స్క్వేర్లో ఘనంగా దీపావళి వేడుకలు