
ఢిల్లీలో పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ప్రదానం చేశారు. రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు.
రిటైర్డ్ సీజేఐ జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేకర్. సినీనటి శోభన, కన్నడ నటుడు అనంత్ నాగ్ పద్మభూషణ్ అందుకోగా, ఎంఆర్ పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. దిగ్గజ ఫోక్ సింగర్ శారద సిన్హా మరణానంతరం పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆమె కుమారుడు అన్షుమాన్ సిన్హా శారద తరఫున అందుకున్నారు.
మరణానంతరం ఎంపికైన కుముదిని రజినికాంత్ తరఫున ఆమె మనవడు పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వి.రాఘవేంద్రాచార్య పంచముఖి, ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రధానమంత్రి వద్ద ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్గా పని చేసిన బిబేక్ దేబ్రోయ్ పద్మ భూషణ్ అవార్డుకు ఎంపిక కాగా, ఆయన భార్య పురస్కారాన్ని అందకున్నారు.
ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జైశంకర్, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషీ సహా పలువురు హాజరయ్యారు. అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. 23 మంది మహిళలు, 10 మంది, విదేశీయులు, 13 మంది మరణానంతరం ఎంపికయ్యారు. వీరిలో నందమూరి బాలకృష్ణ, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వంటి తెలుగు ప్రముఖులు సహా మొత్తం 71 మంది ఏప్రిల్ 28న పురస్కారాలు అందుకోగా, తాజాగా మరికొందరికి ప్రదానం చేశారు.
More Stories
బిహార్ ఎన్నికల్లో వికాసానికి, వినాశనానికి మధ్య పోరు
ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త చిట్నిస్ కన్నుమూత
ఏఐతో డీప్ఫేక్, కృత్రిమ కంటెంట్ లపై కేంద్రం కొరడా