
* పాక్ లో రాచమర్యాదలు.. గన్మెన్లు ఏకే 47తో భద్రత
విచారణ సమయంలో కోర్టు లోపల గేట్లు మూసివేశారు.
పాక్ కోసం గూఢచర్యం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ పర్యటనలో అక్కడి అధికారులు రాచమర్యాదులు చేసినట్లు తెలుస్తున్నది. లాహోర్లోని అనార్కలీ బజార్ని సందర్శించిన సమయంలో యూట్యూబర్కు ఏకంగా ఆరుగురు గన్మెన్లు ఏకే 47తో భద్రత కల్పించినట్లుగా తేలింది.
స్కాట్లాండ్కు చెందిన ఓ యూట్యూబర్ వీడియోతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జ్యోతికి కల్పించిన సెక్యూరిటీని చూసి స్కాట్లాండ్ యూట్యూబర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘కాలమ్ అబ్రాడ్’ అనే యూట్యూబర్ స్కాటిష్ పౌరుడు కాలమ్ మిల్ గత మార్చి నెలలో పాక్లో పర్యటించారు. లాహోర్లోని ప్రసిద్ధ అనార్కలీ బజార్లో తిరుగుతుండగా అక్కడ కొందరు తుపాకులతో కనిపించారు. వారి చొక్కాలపై ‘నో ఫియర్’ అని రాసి ఉంది.
వారితో జ్యోతి మల్హోత్రా వీడియో రికార్డ్ చేస్తూ కనిపించింది. కాలమ్ మిల్ తనను తాను పరిచయం చేసుకుని, పాకిస్తాన్కు రావడం ఇది ఐదోసారని చెప్పింది. జ్యోతి తాను భారతీయురాలినని పరిచయం చేసుకోగా పాక్ ఆతిథ్యంపై ప్రశ్నించారు. ‘చాలా బాగుంది’ అంటూ జ్యోతి బదులిచ్చింది.
జ్యోతి మల్హోత్రా ముందుకు వెళ్తున్న సమయంలో ఆ సాయుధ వ్యక్తులు ఆమెతోనే ఉన్నారని కాలమ్ మిల్ గుర్తించి ఆమెకు తుపాకులతో అంత భద్రత కల్పించాల్సిన అవసరం ఏంటీ? అంటూ వీడియోలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాలమ్ మిల్ ఎలాంటి భద్రత లేకుండా ఒక్కరే తిరగ్గా, జ్యోతి మల్హోత్రాకు ఇంత భారీ భద్రత ఎందుకన్నది చర్చనీయాంశంగా మారింది.
అయితే, సాయుధులు యూనిఫాంలో లేనప్పటికీ మఫ్తీలో ఉన్న భద్రతా సిబ్బంది అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వీడియోతో జ్యోతికి పాకిస్తాన్లో ఎలాంటి పరిచయాలు ఉన్నాయో తెలుస్తున్నది. పాక్లో ఉన్నతస్థాయి పార్టీలకు హాజరై, అక్కడి భద్రత, నిఘా అధికారులను కలిసినట్లు అనుమానిస్తున్నారు. భారత్కు తిరిగివచ్చాక సైతం వారికి టచ్లో ఉన్నట్లు పోలీసుల విచారణలో ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు