ఆదివారం ఒక్కరోజు జరిగే ఈ సమావేశంలో ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా పాల్గొన్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మినహా 19 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
వారిలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, నాగాలాండ్ సీఎం నెఫ్యూ రియో, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, త్రిపుర సీఎం మాణిక్ సాహా, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్చరణ మాఝి, హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైనీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గోవా సీఎం ప్రమోద్ సావంత్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు.

More Stories
‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఆటగాళ్ల ఎంపికలో బంధుప్రీతి 2014 లోనే అంతమైంది
ఒడిశాలో మావోయిస్టు కీలక నేత గణేశ్ తో సహా ఆరుగురు మృతి