
రన్యారావు కేసులో మనీలాండరింగ్పై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. రాన్యా రావుకు, మెడికల్ కాలేజీకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో, అధికారులు బుధవారం ఉదయం కళాశాలలో తనిఖీలు చేపట్టారు. కాలేజీకి సంబంధించిన పలు రికార్డులు, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఈడీ సోదాలు చేపట్టిన సమయంలో మంత్రి పరమేశ్వర కాలేజీలో లేరని తెలిసింది. తన అనుచరులతో వేరే ప్రాంతంలో సమావేశమైనట్లు సంబంధిత వర్గాల సమాచారం.కన్నడ నటి అయిన రన్యారావును మార్చి 3న బంగారం స్మగ్లింగ్ కేసులో డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకొని.. రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదే కేసులో తరుణ్ రాజ్, సాహిల్ సకారియా జైన్లను కూడా అ ధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ముగ్గురు బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర జైలులో ఉన్నారు. ఈ క్రమంలో నిన్న రన్యారావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెతో పాటు తరుణ్ రాజ్ కొండూరుకూడా బెంగళూరు కోర్టు మంగళవారం డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు