
ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు సైన్యం పేర్కొంది. ప్రస్తుతం డ్రోన్లు ఏమి లేవని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. సాంబా, కతువా, రాజోరి, జమ్ములో బ్లాక్ అవుట్ అమల్లో ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం వైష్ణో దేవి భవన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
భవనంతో పాటు, వైష్ణో దేవి వెళ్ళే మార్గంలో కూడా లైట్ల నిలిపివేసినట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. దీంతో జమ్ముకశ్మీర్తో పాటు పంజాబ్లో బ్లాక్ అవుట్ చేశారు. ఢిల్లీ నుంచి అమృత్సర్ విమానాన్ని కూడా దారి మళ్లినట్లు తెలిపారు.
కాగా, ఇండిగో, ఎయిర్ ఇండియా మంగళవారం పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేశాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, చండీగఢ్ సహా మరో మూడు సరిహద్దు ప్రాంతాలకు విమానాలను రద్దు చేస్తూ ఎయిర్లైన్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. జమ్మూ, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్లకు విమాన కార్యకలాపాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
జమ్మూ, అమృత్సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్కోట్ నగరాలకు ఇండిగో విమానాలను రద్దు చేసింది. అయితే, ఇండిగో ప్రయాణికులకు అడ్వైజరీని జారీ చేసింది. తాజాగా పరిణామాల దృష్ట్యా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ జమ్మూ, అమృత్సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్కోట్లకు బయలుదేరే మంగళవారం బయలుదేరే విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో 75 నిముషాల ముందే చెక్ ఇన్ క్లోజ్ అవుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణీకులు భద్రతా తనిఖీలు చెక్ ఇన్ ఫార్మాలిటీప్ పూర్తి చేసుకోవడానికి సమయానికి ముందే తమ తమ విమానాశ్రయాలకు చేరుకోవాలని ఎయిర్ ఇండియా, ఇండిగోతో పాటు స్పైస్జెట్ విజ్ఞప్తి చేశాయి.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ