
1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్లోని సిల్హెత్(ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది) జిల్లాలో నిరుపేద కుటుంబంలో స్వామి శివానంద జన్మించినట్లు వారి శుష్యులు వెల్లడించారు. ఆరేళ్ల వయసులోనే శివానంద తల్లిదండ్రులు మరణించారు. దీంతో ఆయన బంగాల్లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి ఆయనను పెంచి పెద్ద చేయడమేగాక, యోగా వంటి ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. ఈ క్రమంలోనే తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేశారు. 50 ఏళ్లుగా పూరిలో 400-600 కుష్టు రోగులకు సేవ చేశారు.
శివానంద్ బాబా వారణాసిలోని భేలుపూర్ ప్రాంతంలోని దుర్గాకుండ్లో ఉన్న కబీర్ నగర్లో నివసించారు. ఆయన ప్రతిరోజూ కూడా క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం చేసేవారు. ఆయన జీవితం బ్రహ్మచర్యానికి అనేక మందికి ఉదాహరణగా నిలిచింది. అయితే యోగా రంగానికి చేసిన కృషికి గాను 2022లో శివానంద, అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆ సమయంలో తెల్లని ధోవతి, కుర్తా ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా అత్యంత సామాన్యంగా వచ్చి పురస్కారాన్ని స్వీకరించారు. దీంతో అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించారు.
More Stories
వక్ఫ్ సవరణ చట్టంలో రెండు నిబంధనల అమలు నిలిపివేత
బాక్సింగ్ చాంపియన్షిప్స్లో రెండు బంగారు పతకాలు
ఓట్ల కోసం చొరబాటుదారులను కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది