
ఆలయ సముదాయంలో నిర్మిస్తున్న ఏడు దేవాలయాల పనులు మే నెల చివరినాటికి పూర్తవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే రామాలయ సముదాయంలోని రెండు దేవాలయాల్లో మినహా అన్నింట్లోనూ ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారని నృపేంద్ర మిశ్రా తెలిపారు. మే 23న రామ దర్బార్ గర్భగుడిలో విగ్రహాలు ప్రతిష్ఠిస్తామని వెల్లడించారు. మే 30కంటే ముందే లక్ష్మణుడి విగ్రహాన్ని శేషావతార్ ఆలయంలో ప్రతిష్ఠ చేస్తామని పేర్కొన్నారు. అన్ని దేవాలయాలలో విగ్రహాలను ప్రతిష్టించిన తర్వాత పూజలు స్పష్టం చేశారు. “జూన్ 3- 5 వరకు అయోధ్య రామాలయంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేస్తాం” అని తెలిపారు.
“మొదటి అంతస్తులో భక్తుల బరువు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని నిర్మించాం. మొదటి అంతస్తులోకి భక్తుల ప్రవేశం ఆధారంగా సీబీఆర్ఐ రూర్కీ మూడు నెలల పాటు అధ్యయనం నిర్వహిస్తుంది. ఆలయంలోని రాళ్లు ఏమైనా దెబ్బతిన్నాయా లేదా అని పరిశీలిస్తుంది. అందుకు ఆలయంలో 10 సెన్సార్లు ఏర్పాటు చేశాం.” అని నృపేంద్ర మిశ్రా వివరించారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్