
కులగణన చేసే అధికారం రాష్ర్టానికి లేదని తెలిసినా కేవలం ఓట్ల కోసమే హామీ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా ఆ తర్వాత న్యాయనిపుణులు, బీసీ సంఘాల మేధావులు చెప్పినా వినకుండా అశాస్త్రీయమైన రీతిలో కులగణన నిర్వహించింది. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా స్థూలంగా గణాంకాలను ప్రకటించింది. కులాలు, ఉపకులాల వారీగా లెక్కలను వెల్లడించలేదు.
ఇప్పటివరకు సర్వే నివేదికనే బహిర్గతం చేయలేదు. ఆ అసంబద్ధమైన గణాంకాలనే డెడికేటెడ్ కమిషన్కు అందజేసింది. ఆ గణంకాలనే ప్రామాణికంగా తీసుకుని బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను కల్పించాలని సిఫారసు చేసింది. ఆ నివేదికను సర్కారు బయటపెట్టలేదు.
కమిషన్ నివేదిక ఆధారంగా సర్కారు హడావుడిగా బీసీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం మాత్రం తాజాగా రాష్ర్టాల కులగణనకు సాధికారత లేదని తేల్చిచెప్పింది. అంటే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సర్కారు పంపిన బిల్లులను కేంద్రం ఆమోదించబోదని తేలిపోయింది. వెరసి బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు అందని ద్రాక్షగానే మరోసారి మిగిలిపోనున్నది.
More Stories
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు:
ఫీజు బకాయిలు చెల్లించకపోతే సచివాలయం ముట్టడి!
తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం