
కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదం పొందకముందే ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి, ప్లానింగ్, నిర్మాణ ప్రదేశాలు, ప్రణాళికలలో మార్పులు చేశారని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపి కేసీఆర్ను జైలులో వేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన డబ్బుతోనే వరంగల్ లో ప్లీనరీ సభ పెడుతున్నారని అరవింద్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం, అప్పటి ఇరిగేషన్ మంత్రిపైన సీబీఐ, ఈడీ విచారణ జరిపి జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, కేసీఆర్ కంటే రేవంత్రెడ్డి అత్యంత ప్రమాదకరం అని విమర్శలు చేశారు. రేవంత్రెడ్డిని ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎన్నుకుంటే పాత అధికారులనే ఎందుకు కొనసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంలో అత్యంత అవినీతి అధికారులున్నారని ఆరోపించారు. ముందు అధికారుల మీద విచారణ చేస్తే ఎవరు సమర్ధవంతమైన వారో తెలుస్తుందని అరవింద్ పేర్కొన్నారు.
More Stories
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం
దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు
తెలంగాణలో 15 నుంచి కాలేజీలు నిరవధిక బంద్