
పిల్లల అక్రమంగా రవాణా చేసేవాళ్లు హంతకులకంటే ప్రమాదకరమని జస్టిస్ పార్థివాలా స్పష్టం చేశారు. “ఎవరైనా ఒక వ్యక్తిని హత్య చేస్తే దాని వెనుక పలు కారణాలు, ఉద్దేశాలు ఉంటాయి. ఆ తర్వాత అతడు మరో హత్య చేయకపోవచ్చు. కానీ పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేవారు ఆ నేరాలకు మళ్లీమళ్లీ పాల్పడుతున్నారు. వారు ఈ సమాజానికి హంతకుల కంటే ప్రమాదకరమైనవారు” అని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది.
ఢిల్లీలో పిల్లల అక్రమ రవాణా రాకెట్ వెనుకున్న కీలక సూత్రధారిని వెంటనే పట్టుకోవాలని పోలీసులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చిన్నారులను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నారని, దీని వెనుక ఒక పెద్ద ముఠా పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని పేర్కొంది.
ఈ సందర్భంగా పోలీసులు కొందరు పిల్లలను ఎవరూ కిడ్నాప్ చేయడం లేదని, తల్లిదండ్రులే విక్రయిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాంతో పిల్లలు దొరికినా ఎవరైనా తల్లిదండ్రులు వారిని తిరిగి తీసుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేకపోతే ప్రభుత్వమే వారి బాధ్యత తీసుకోవాలని కోర్టు సూచించింది. ప్రతి ఏడాది దాదాపుగా రెండు వేల మంది పిల్లల అక్రమ రవాణా కేసులు వెలుగులోకి వస్తున్నాయని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా