
డీఎంకే అవినీతి, శాంతిభద్రతల పరిస్థితి, దళిత మహిళలపై అకృత్యాలు వంటి అంశాలపై వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పునివ్వనున్నారని అమిత్షా పేర్కొన్నారు. డీఎంకే హయాంలో రూ.39,000 కోట్ల లిక్కర్ స్కామ్, ఇసుక మైనింగ్ స్కామ్, ఎల్కాట్ స్కామ్, ట్రాన్పోర్ట్ స్కామ్, మనీ లాండరింగ్ స్కామ్లు చోటుచేసుకున్నాయని, తమిళనాడు ప్రజలకు డీఎంకే, ఉదయనిధి స్టాలిన్, స్టాలిన్ సమాధానమివ్వాలని స్పష్టం చేశారు.
అన్నాడీఎంకే 1998 నుండి ఎన్డీఏలో భాగంగా ఉందని, ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత గతంలో కలిసి పనిచేశారని కూడా షా గుర్తు చేశారు. అయితే, మళ్లీ కలిసి పని చేసేందుకు ‘ఇంత సమయం ఎందుకు పట్టింది? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఈ కూటమి ఇకపై శాశ్వతంగా ఉంటుందని, అందుకే సమయం పట్టిందని చెప్పారు.
అన్నామలై స్థానంలో తమిళనాడులో కొత్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ను నియమించిన రోజే పొత్తులపై ప్రకటన రావడం విశేషం. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి వచ్చేలో ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులో ఏఐఏడీఎంకే, బీజేపీ పొత్తులకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1998 సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని పార్టీ బీజేపీతో జతకట్టి రాష్ట్రంలోని 39 సీట్లలో 30 సీట్లను గెలుచుకుంది.
అయితే, తర్వాతి సంవత్సరమే ఏఐఏడీఎంకే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. 2004 లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. ఏఐఏడీఎంకే కేవలం ఒక సీటును గెలుచుకోగా, బీజేపీకి ఒక్క సీటు దక్కలేదు. కేంద్రంలో ఎన్డీయే పాలన ముగియడంతో యూపీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది. జయలలిత శకం తర్వాత, ఏఐఏడీఎంకే 2021 రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ కూటమి కేవలం 75 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. 2023లో ఈ కూటమి ముక్కలైంది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు