
విజయవాడలో ప్రాంతీయ పాస్పోర్ట్ నూతన కార్యాలయంను ఆధునీకరించడంతో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. విజయవాడలో నూతన కార్యాలయంను ప్రారంభిస్తూ కాంప్లెక్స్ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని, విజయవాడలోనే పాస్పోర్ట్ ప్రింటింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.
విజయవాడలో ఏర్పాటు అయిన రీజనల్ పాస్ పోర్ట్ కేంద్రం నుంచి ప్రజలు మరిన్నిసేవలు పొందాలని సూచించారు. రోజుకు వెయ్యి స్లాట్లు ఇచ్చేలా ఆధునీకరణ చేశామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇటీవల యువత అవసరాలను దృష్టిలో ఉంచుకుని చాలా సేవలు అందుబాటులోకి తెచ్చామని కీర్తి వర్ధన్ సింగ్ చెప్పారు.
రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయంలోనే ప్రింటింగ్, ఇతర అన్ని రకాల సేవలు ఇక్కడ నుంచే అందిస్తారని తెలిపారు. ఒక్కరోజులో 500 దరఖాస్తుల నుంచి 1000 దరఖాస్తులకు పెరిగాయని పేర్కొన్నారు. పాస్ పోర్ట్లను సకాలంలో బట్వాడా చేస్తున్న పోస్టల్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక సెంట్రల్ కార్యాలయం నిర్మాణం కోసం రెండు ఎకరాలు కేటాయించారని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు.
నేడు ఉద్యోగ, వ్యాపారం పరంగా చాలా అవకాశాలు వచ్చాయని చెప్పారు. కరోనా సమయంలో మనమే అందరికీ అండగా నిలిచామని చెప్పారు. ప్రధాని మోదీ సారధ్యంలో ఏపీ ఎకనామిక్ గ్రోత్ పెరిగిందని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. మోదీ నాయకత్వాన్ని, ఆయన పని తీరును ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని చెప్పారు.
2047 వికసిత్ భారత్లో భాగంగా ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని ఉద్ఘాటించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారని పేర్కొంటూ ప్రజల సమస్యలు పరిష్కారం కోసం తాము ఎప్పుడూ పనిచేస్తూ ఉంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ పరంగా కూడా దేశం అభివృద్ధి చెందిందని తెలిపారు.
మన దేశం అమలు చేస్తున్న టెక్నాలజీని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకున్నాయని పేర్కొంటూ ప్రపంచంలో మన దేశం గ్లోబల్ ఎకానమీ పరంగా మూడోస్థానంలో నిలిచిందని చెప్పారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు వృద్ధి రేటులో ముందంజలో ఉన్నాయని తెలిపారు. గుంటూరు నుంచి జర్మనీ, నెల్లూరు నుంచి న్యూయార్క్ వరకు ప్రపంచం మొత్తం మన వాళ్లు ఉన్నారని చెప్పుకొచ్చారు.
కార్పొరేట్ ఆఫీస్ తరహాలో పాస్ పోర్ట్ కార్యాలయం ఆధునీకరించారని ఎంపీ కేశినేని శివనాధ్ తెలిపారు. విశాఖపట్నంతో పాటు ఇప్పుడు విజయవాడలో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. 600 నుంచి 2 వేల మంది నేడు దరఖాస్తులు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అమరావతిలో కూడా ఒక పాస్ పోర్ట్ కార్యాలయం నిర్మాణం జరుగుతుందని చెప్పారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు