పొగపీల్చడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. తన భార్య, పిల్లలు సింగపూర్ లోనే ఉంటున్నారని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్ వాళ్లున్న చోటికి 10 నిమిషాల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ వెంటనే సింగపూర్ బయలు దేరారు. అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్. అక్కడ కార్యక్రమాలను ముగించుకుని బుధవారం తెల్లవారుజామున ఒంటిగంటకు సింగపూర్ బయలుదేరారు.
ఈ ఘటన తెలుసుకొని అవసరం అయిన సహాయం చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారని, ఈ సమయంలో తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేశ్, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు స్పందించిన అందరికీ కృతజ్ఞతలు ఆయన తెలిపారు. మార్క్ శంకర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకూ పవన్ కల్యాణ్, చిరంజీవి దంపతులు సింగపూర్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి.

More Stories
‘మొంథా’ తుపాను ప్రభావం, సన్నద్ధతపై నడ్డా ఆరా
పరకామణి కేసును సీఐడీకి అప్పగించిన హైకోర్టు
ఏపీలో కొత్తగా మరో నాలుగు జిల్లాలు ఏర్పాటు