
మెట్రో రైల్లో బెట్టింగ్ యాడ్స్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. బెట్టింగ్ యాప్లతో హైదరాబాద్ మెట్రో రైల్ కుదుర్చుకున్న ఒప్పందాలపై దర్యాప్తు చేయించాలని కోరుతూ న్యాయవాది ఎన్.నాగూర్బాబుహైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మెట్రో రైలులో, ఫ్లాట్ఫారాలు, స్టేషన్ ఆవరణలలో బెట్టింగ్ యాప్లపై ప్రకటనలను తక్షణం నిలిపివేసేలా ఆదేశించాలని కోరారు.
మెట్రో రైల్వేకు, బెట్టింగ్ యాప్ సంస్థలకు మధ్య కుదిరిన లావాదేవీలపై దర్యాప్తు చేపట్టేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు.
బెట్టింగ్ యాప్లపై ఇడి ఇప్పటికే కేసు నమోదు చేసి రూ.399 కోట్లు జప్తు చేసిన నేపథ్యంలో ఈ ఒప్పందాలపై విచారణ జరపాలని కోరారు. ప్రకటనల విధానంపై హైకోర్టు మాజీ న్యాయమూర్తితో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రకటనలకు బాధ్యులైన ఉన్నతాధికారుల నుంచి పరిహారం రాబట్టి ప్రజా సంక్షేమ నిధికి చెల్లించాలని సూచించారు. ఇందులో ప్రతివాదులుగా మెట్రోతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డిజిపి, సిఎస్, జిహెచ్ఎంసి కమిషనర్లతోపాటు వారిని వ్యక్తిగత హోదాలోను చేర్చారు. ఈ పిటిషన్ నెంబరు కేటాయింపు నిమిత్తం రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు