దేశంలోని అన్నదాతల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రైతుల నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఆదివారం విరమించారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీతో పాటు, పలు డిమాండ్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గతేడాది నవంబర్ 26న ఆయన నిరాహార దీక్ష చేపట్టారు.
దానిని విరమించుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి రణ్వీత్సింగ్ బిట్టు విజ్ఞప్తి చేశారు. దీనితో పంజాబ్లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్లో నిర్వహించిన ‘కిసాన్ మహా పంచాయత్’లో నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు దల్లేవాల్ ప్రకటించారు.
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడుతూ, ‘ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని మీరంతా నన్ను కోరారు. ఈ ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపినందుకు మీకు రుణపడి ఉంటాను. మీ మనోభావాలను నేను గౌరవిస్తూ, మీ ఆదేశాలను పాటిస్తున్నా” అని తెలిపారు.

More Stories
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!
భారత అంతరిక్ష రంగం 2025లో అద్భుత పురోగతి