
1971లో గరిష్ఠంగా 2.2%గా నమోదైన ఈ సగటు 2036 నాటికల్లా 0.58%కు పడిపోనుందని పేర్కొంది. దీనివల్ల దేశంలో వయోవృద్ధుల (60 ఏళ్లు పైబడినవారు) జనాభా బాగా పెరగనుంది. ఫలితంగా ఆధారపడేవారి నిష్పత్తి మారనుంది. ఇప్పటివరకు పెద్దలపై యువకులు ఆధారపడుతుండగా, ఇకమీదట పిన్నలపై పెద్దలు ఆధారపడే పరిస్థితులు పెరుగుతాయి.
చారిత్రకంగా చూస్తే దేశ జనాభా పిరమిడ్ కింది భాగంలో విస్తృతంగా ఉండేది. అంటే పిల్లలు/యువత జనాభా ఎక్కువ ఉండేది. కానీ 2026, 2036 జనాభా అంచనాల ప్రకారం పిరమిడ్ అడుగు భాగం కుంచించుకుపోనుంది. వర్కింగ్ ఏజ్ గ్రూప్ జనాభా పెరగనుంది. యువ జనాభా తగ్గుముఖం పట్టి వయోధికులపై సామాజిక, ఆర్థిక బాధ్యతలు పెరగనున్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో మహిళలు 48.5% మేర ఉన్నారు. 2036 నాటికి ఇది పాక్షికంగా పెరిగి 48.8%కి చేరుకోనుంది. ఇదే సమయంలో పురుషుల జనాభా 51.5% నుంచి 51.2%కి తగ్గనుంది. కొన్ని దశాబ్దాలుగా మహిళల జనాభా గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ పెరిగింది.
1951లో 14.67 కోట్ల మేర ఉన్న గ్రామీణ ప్రాంత మహిళల సంఖ్య, 2036 నాటికి 45.67 కోట్లకు పెరగనున్నట్లు అంచనా. ఇదే సమయంలో పట్టణ ప్రాంత మహిళల జనాభా 2.89 కోట్ల నుంచి 28.59 కోట్లకు చేరనుంది. లింగ నిష్పత్తిలో సానుకూల పురోగతి కనిపిస్తోంది. 2011లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మంది మహిళలు ఉండగా, 2036 నాటికి ఆ సంఖ్య 952కు చేరనున్నట్లు అంచనా.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్