
కాగా, తమిళనాడులో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని అన్నామలై తెలిపారు. పార్టీ ఎదుగుదల కోసం చాలా మంది తమ ప్రాణాలను అర్పించారని చెప్పారు. అందుకే పార్టీకి ఎల్లప్పుడూ మంచి జరుగాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే బీజేపీ అధిష్టానం అన్నామలైకు పార్టీలో మరో కీలక పదవి ఇవ్వవచ్చని తెలుస్తున్నది.
మరోవైపు 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తుకు బీజేపీ సిద్ధమైంది. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని అధికార డీఎంకే పార్టీ భావిస్తుండగా ఎలాగైనా ఈసారి తమిళనాడులో అడుగుపెట్టాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇక తొలిసారే విజయం సాధించి చరిత్ర సృష్టించాలని ప్రముఖ నటుడు విజయ్ టీవీకే పార్టీని స్థాపించారు.
”తమిళనాడు బీజేపీలో ఎలాంటి పోటీ లేదు. మేము ఏకగ్రీవంగా నాయకుడిని ఎన్నుకుంటాం. నాయకత్వ రేసులో నేను పోటీ పడను” అని చెప్పారు. 2011 కర్ణాటక బ్యాచ్కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై 2020 ఆగస్టులో బీజేపీ చేరారు. కేవలం పది నెలల్లోనే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాను పార్టీ కార్యకర్తగా అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నామలై చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 7న అన్నామలై ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అవుతారని తెలుస్తోంది.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
నవంబర్ 25న పూర్తి కానున్న అయోధ్య రామాలయం
ఐపీఎస్ అధికారి పూరన్ ఆత్మహత్యపై సిట్