“బాట్స్ చేసిన 2 వేల వీసా అపాయింట్మెంట్లను భారత్లోని కాన్సులర్ టీం రద్దు చేస్తోంది. మా షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్లు, ఫిక్సర్లను ఏమాత్రం సహించేది లేదు. ఈ అపాయింట్మెంట్లను రద్దు చేయడంతో పాటు.. ఆయా సంబంధిత ఖాతాలకు షెడ్యూలింగ్ అధికారాలను కూడా సస్పెండ్ చేస్తున్నాం” అని దౌత్య కార్యాలయం తన ఎక్స్ పోస్టులో పేర్కొంది.
అమెరికాకు వ్యాపార, పర్యాటక, బీ1, బీ2, విద్యార్థి వీసాలకు అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సిన వస్తుందన్న విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా వీసా అప్లై చేసుకుంటే ఏండ్ల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఏజెంట్లను డబ్బు చెల్లిస్తే కేవలం నెల రోజుల్లోనే అపాయింట్మెంట్లు దొరుకుతాయి. ఇది చాలా కాలంగా జరుగుతున్నదే.
ఏజెంట్లు కొన్నిరకాల ప్రత్యేకమైన బాట్స్ను ఉపయోగించి అపాయింట్మెంట్ స్లాట్లను బ్లాక్ చేస్తుంటారు. దీంతో వ్యక్తిగతంగా వీసాలకు అపాయింట్మెంట్లు చేసుకున్న వారు కూడా సుదీర్ఘ కాలం వేచి ఉండలేక ఏజెంట్లకు డబ్బులు చెల్లించి ఈ తరహాలో అపాయింట్మెంట్లు పొందుతుంటారు. దీని కోసం ఒక్కో వీసా దరఖాస్తుకి రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకూ ఏజెంట్లు వసూలు చేస్తుంటారు.
కాగా, 2023-24 (అక్టోబర్ 2023 – సెప్టెంబర్ 2024) ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఎఫ్-1 విద్యార్థి వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో 2.79 లక్షలు (41 శాతం) తిరస్కరించారు. గతేడాది 6.99 లక్షల దరఖాస్తులు రాగా 36 శాతం తిరస్కరణకు గురయ్యాయి. ఇక 2014లో వీసాల తిరస్కరణ రేటు 15 శాతంగా ఉండేది. ఇప్పుడు అది దాదాపు మూడు రెట్టు పెరిగింది. ఈ కారణంగా యూఎస్ యూనివర్సిటీల్లో చదువాలనుకునే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది.

More Stories
మొహియుద్దీన్ నగర్ను మోహన్నగర్గా మారుస్తాం
బిహార్ ప్రచారంలో రాహుల్ వ్యాఖ్యలపై మరో వివాదం
7న సామూహికంగా వందేమాతరం ఆలాపన