ఏప్రిల్‌ 6న రామేశ్వరానికి ప్రధాని

ఏప్రిల్‌ 6న రామేశ్వరానికి ప్రధాని
 
ఏప్రిల్‌ 6న రామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించనున్నదారు. ఈ సందర్భంగా పంబన్‌ కొత్త రైల్వే వంతెనను జాతికి అంకితం చేయనున్నారు. రైల్వే వంతెనను ప్రారంభించి రామేశ్వరం రామనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. 2.5 కిలోమీటర్ల పొడవైన ఈ పంబన్‌ వంతెన భారత ప్రధాన భూభాగంతో రామేశ్వరం దీప్వాన్ని కలుపుతుంది. 
 
బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన వంతెనపై రైలు ప్రయాణించేందుకు 25 నుంచి 30 నిమిషాల సమయం పట్టగా, సరికొత్తగా నిర్మించిన వంతెనపై కేవలం ఐదు నిమిషాల్లోనే దూసుకెళ్లనున్నది.  ఆసియాలోనే తొలిసారిగా వర్టికల్‌ లిఫ్ట్‌ను వంతెనను రైల్వేశాఖ నిర్మించింది. పాత పంబన్‌ బ్రిడ్జి స్థానంలో అందుబాటులోకి రానున్నది. 
 
పాత వంతెన 1914లో నిర్మించారు. ఈ వంతెన తప్పుపట్టి శిథిలావస్థకు చేరడంతో 2022లో మూసివేశారు. రైలు వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) రూ.535 కోట్ల వ్యయంతో నిర్మించింది. గతేడాది నవంబర్‌లో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ రైల్వే వంతెన పూర్తయ్యిందని, త్వరలోనే అందుబాటులోకి రానుందంటూ సమాచారం అందించారు. 
 
1914లో నిర్మించిన పంబన్‌ వంతెన 104 సంవత్సరాలు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించిందని, తుప్పుపట్టడం కారణంగా రాకపోకలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. దాని సమీపంలోనే కొత్త పంబన్‌ వంతెనను నిర్మించామని చెప్పారు. వేగంతో పాటు సరికొత్త టెక్నాలజీని వినియోగించి వంతెనను నిర్మించామని తెలిపారు. కొత్తగా నిర్మించిన వంతెనపై ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయ్యాయి. 
 
రైల్వే సేఫ్టీ కమిషనర్‌ వంతెనపై 75 కిలోమీటర్ల వేగంతో రైలు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందని ఆర్‌వీఎన్‌ఎల్‌ సీనియర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌ శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. కొత్త వంతెనకు తుప్పు సమస్య రాకుండా మూడు పొరల పాలీసిలోక్సేన్ పెయింట్ వేశారు. దాంతో దాదాపు 58 సంవత్సరాల వరకు తుప్పు ముప్పు ఉండదు. 
 
చిన్న చిన్న మరమ్మతులు చేస్తే వందేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సముద్రంలో వేసిన దిమ్మెలకు ఇబ్బంది కలుగకుండా కేసింగ్ విధానంలో ఐరన్ చట్రాలతో కాంక్రీట్ వేశారు. వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిలో ఒక బోల్డును వాడకపోడం విశేషం. వెల్డింగ్‌తోనే నే జోడించారు. వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో లింక్ చేయగా, గంటకు 58 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తే స్కాడా సెన్సార్లు ఆటోమేటిక్‌గా వంతెనను మూసివేస్తాయి. 
 
మత్స్యకారుల పడవలు, నేవీ, పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చిన సమయంలో సిబ్బంది దిమ్మెల వద్ద ఏర్పాటు చేసిన గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెన లిఫ్ట్‌ని ఆపరేట్‌ చేస్తుంటారు.