
మహారాష్ట్రలోని నాగపూర్లో మార్చి 17న రెండు గ్రూపుల మధ్య చెలరేగిన హింసాకాండకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఫాహీమ్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. షాహీమ్ ఖన్ 2024 లోక్సభ ఎన్నికల్లో నితిన్ గడ్కరిపై పోటీ చేశారు. ఇంతవరకూ పోలీసులు 50 మందిని అరెస్టు చేయగా, నాగపూర్లోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా రెండవ రోజైన బుధవారంనాడు కూడా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు.
కాగా, నాగపూర్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ రాహులవ్ మక్నికర్ తెలిపారు. 10 పోలీసు బృందాలు ఇంతవరకూ 50 మంది దుండగులను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ కేసులో 19 మంది నిందితులను జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు (జేఎంఎఫ్సీ) రిమాండ్కు పంపింది. నాగపూర్లో ఇటీవల జరిగిన హింసాకాండను రాష్ట్ర హోం మంత్రి యోగేష్ కదమ్ ఖండించారు. ఇది చాలా సీరియస్ అంశమని చెప్పారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, డీసీపీ స్థాయి అధికారులు, పోలీసు సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు.
గత మూడు నాలుగేళ్లుగా మహారాష్ట్రలో ఉంటున్న బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులపై చర్యలను తీవ్రతరం చేశామని వెల్లడించాయిరు. కాగా, ప్రజలు ప్రశాంతతను పాటించాలని కాంగ్రెస్ ఎంపీ వర్ష గైఖ్వాడ్ కోరారు. పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు ప్రయత్నం కృషి చేయాలని, వాళ్ల నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వం కట్టడి చేయాలని కోరారు.
నాగపూర్ హింసాకాండలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని నేషనల్ కాగ్రెస్ పార్టీ (ఎన్సీపీ-ఎస్సీపీ) నేత రోహిత్ పవార్ సూచించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగబేబ్ సమాధి తొలగించాలనే డిమాండ్ నేపథ్యంలో ఒక మతానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని తగులబెట్టారనే వదంతులు చెలరేగడంతో నాగపూర్లో పలు చోట్ల హింసాకాండ చెలరేగింది.
హసన్పురి ఏరియాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పలు వాహనాలను, ఆస్తులకు నిప్పుపెట్టారు. ర్యాపిడ్ కంట్రోల్ ఫోర్స్ రంగంలోకి దిగి పలువురిని అదుపులోనికి తీసుకుంది. ర్యాపిడ్ కంట్రోల్ ఫోర్స్లోని మహిళా పోలీసు అధికారిపై అల్లరిమూక అసభ్యంగా ప్రవర్తించినట్టు ఎఫ్ఐఆర్ సైతం నమోదైంది. ఈనెల17వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు మొదలైన హింసాకాండ రాత్రి 11.30 వరకూ కొనసాగింది. 34 మందికి పైగా పోలీసులు సిబ్బంది గాయపడ్డారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో 2,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించామని పోలీస్ కమిషనర్ రవీందర్ కుమార్ సింగల్ తెలిపారు. క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టి), అల్లర్ల నియంత్రణ పోలీసులు (ఆర్సిపి) డిసిపి ర్యాంక్ అధికారి నేతృత్వంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయని చెప్పారు. 200 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, మరో 200 మంది కోసం గాలిస్తున్నామని వివరించారు. ఈ హింసాకాండకు బాధ్యులు ఒకరేనా లేదా ఏదైనా సంస్థ ఉందా అన్న అంశంపై దర్యాప్తు చేపడుతున్నామని వెల్లడించారు.
More Stories
మణిపుర్ ప్రజలారా మీ వెంట నేనున్నా….
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి