
అరెస్టయిన ఉగ్రవాది లాజర్ జర్మనీకి చెందిన జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ మాడ్యూల్ చీఫ్ స్వర్ణ్ సింగ్ అలియాస్ జీవన్ ఫౌజీ కోసం పని చేస్తున్నారు. పాక్కు చెందిన ఐఎస్ఐ యాక్టివిస్ట్లతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఉగ్రవాది లాజర్ మాసిహ్ను విచారించగా అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ వస్తున్న భక్తులతో కూడిన బస్సును పేల్చేందుకు లాజర్ కుట్ర పన్నినట్లు వెల్లడైంది.
ఇటీవల ఫరీదాబాద్లోని బాన్స్రోడ్ పాలి నుంచి అబ్దుల్ రెహమాన్ (19) గురించి కీలక విషయం బయటపడింది. ఉగ్రవాద సంస్థ ఐసిస్ అయోధ్య రామమందిరంపై దాడి చేసేందుకు అబ్దుల్ను సిద్ధం చేశారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రాంతీయశాఖ అయిన ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ప్రావిన్స్ ఈ దాడికి కుట్ర పన్నిందని అధికార వర్గాలు పేర్కొన్నారు.
అయోధ్యలో మసీద్ స్థానంలో ఆలయం నిర్మిస్తున్నారని నూరిపోసి అబ్దుల్ రెహమాన్తో పాటు పలువురి బ్రెయిన్ వాష్ చేసి ఆలయంపై దాడి చేసేందుకు పన్నాగం పన్నారు. ఐసిస్ ఈ శాఖ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో చురుగ్గా ఉంది.
More Stories
కైలాస మానససరోవర్ యాత్రకు వెబ్సైట్ ప్రారంభం
రక్షణ దళాల కదలికల ప్రసారాలపై కేంద్రం ఆంక్షలు!
కుప్వారా జిల్లాలో భారీగా ఆయుధాలు స్వాధీనం