
భారత్పై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అధ్యక్షుడైన తర్వాత ఆ దేశ కాంగ్రెస్ సంయుక్త సెషన్లో తొలిసారి ప్రసంగిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి అమలులోకి రానున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆరు వారాల్లో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, విజయాలను వివరించారు. ఆరు వారాల్లో 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశానని తెలిపారు.
‘కొన్ని దేశాలు దశాబ్దాల పాటు మనపై టారిఫ్లు విధిస్తున్నాయి. ఇప్పుడు మన సమయం వచ్చింది. సగటున చూస్తే ఐరోపా సమాఖ్య, చైనా, బ్రెజిల్, భారత్ వంటి చాలా దేశాలు మన నుంచి అధికంగా వసూలు చేస్తున్నాయి. భారత్ మనపై 100 శాతం కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేస్తోంది. మన ఉత్పత్తులపై చైనా సగటు సుంకం మనం వసూలు చేసే దానికంటే రెండింతలు ఎక్కువ. ఇక దక్షిణ కొరియా సగటు సుంకం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది” అని ట్రంప్ వివరించారు.
“ప్రస్తుత వ్యవస్థలపై అమెరికాకు ఎక్కడా న్యాయం జరగలేదు. అందుకే, ఏప్రిల్ 2 నుంచి ఆయా దేశాలపై మనం కూడా ప్రతీకార సుంకాలు విధిస్తాం. వాళ్లు ఎంత విధిస్తే మనమూ అంతే వసూలు చేస్తాం. వీటి వల్ల అమెరికా మరింత సంపన్నంగా మారుతుంది. గొప్ప దేశంగా మళ్లీ అవతరిస్తుంది? అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మళ్లీ తిరిగొచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. జనవరి 20న బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి గత ఆరు వారాల్లో 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశానని తెలిపారు. మరో 400 కార్యనిర్వాహక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
More Stories
పాక్లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
పీవోకేలో ఆందోళనకారులపై కాల్పులు.. 10 మంది మృతి
అమెరికాలో మొదలైన ‘షట్డౌన్’