మరోవైపు, మంత్రి ధనంజయ్ ముండేకు గట్టి మద్దతు ఇస్తున్న ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్కు, మంత్రికి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను తాను సమర్పించినట్లు సామాజిక కార్యకర్త అంజలి దమానియా పేర్కొన్నారు. దీంతో ధనంజయ్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు మళ్లీ మొదలయ్యాయి.
ఎన్సీపీ (శరద్ పవార్) కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే సైతం ధనంజయ్ ముండే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ధనంజయ్ మాట్లాడుతూ, తనను మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీఎం దేవేంద్ర ఫడణవీస్ లేదా ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్తే వెంటనే రాజీనామా చేస్తానని ప్రకటించారు.
దీనిపై ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత ఏక్నాథ్ శిందేతో చర్చలు జరిపిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేయాలని ధనంజయకు స్పష్టం చేసినట్లు సమాచారం. ధనంజయ పదవికి రాజీనామా చేయగా దాన్ని ముఖ్యమంత్రి ఫడణవీస్ ఆమోదించారు.

More Stories
ఢిల్లీ పేలుడులో సూత్రధారులు ఐదుగురు వైద్యులు!
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి
మహారాష్ట్ర బీటలు వారుతున్న ఇండియా కూటమి