
ముఖ్యమంత్రిగా డీకే బాధ్యతలు ఏ క్షణంలోనైనా చేపట్టవచ్చని, తన కష్టం, నాయకత్వ పటిమతోనే డీకే ఆ స్థానాన్ని సంపాదించుకుంటున్నారని మెయిలీ తెలిపారు. డీకేకు మొదటిసారి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడంలో తన పాత్రను ఆయన గుర్తు చేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పార్టీ కోసం డీకే చేసిన సేవలను మొయిలీ ప్రశంసించారు.
నాయకత్వ మార్పుపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని డీకే చేపట్టడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. విమర్శలు లేక ఊహాగానాలు ఎలా ఉన్నప్పటికీ డీకే ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు.
అయితే, రాష్ట్రంలో నాయకత్వం మార్పుపై వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి డీకే శివకుమార్ నిరాకరించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని డీకే జవాబిచ్చారు. ముఖ్యమంత్రి మార్పుపై పార్టీలో జోరుగా సాగుతున్న ప్రచారంపై వ్యాఖ్యానించడానికి కూడా డీకే నిరాకరించారు. తాను పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉన్నానని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రమంతా పర్యటించి బూత్ కమిటీల చేత ప్రతిజ్ఞ చేయించాల్సి ఉందని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు.
తాను బీజేపీకి దగ్గరవుతున్నానంటూ వస్తున్న వార్తలను డీకే తోసిపుచ్చారు. అదంతా తప్పుడు ప్రచారమని, కాంగ్రెస్ పట్ల తన విధేయత చెక్కుచెదరదని ఆయన పునరుద్ఘాటించారు. కాగా, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు తాను నడుచుకుంటానని, నాయకత్వం మార్పుపై నిర్ణయం తీసుకోవలసింది అధిష్టానమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం స్పష్టం చేశారు.
వీరప్ప మొయిలీ చేసిన ప్రకటనపై సిద్ధరామయ్య స్పందిస్తూ దీనిపై అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలని తాను మొదటి నుంచి చెబుతున్నానని గుర్తు చేశారు. మొయిలీ చెప్పారా? లేక మరెవరైనా చెప్పారా? అన్నది ముఖ్యం కాదని, అధిష్టానం ఏమి చెప్పినా అదే ఫైనల్ అంటూ సీఎం చెప్పారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు