
* కుంభమేళాను విమర్శించేవారు రాబందులు, పందులు… యోగి
అప్పట్లో ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి బిహార్లో అధికారాన్ని వెలగబెట్టడం ద్వారా ఆ రాష్ట్రాన్ని నాశనం చేశాయని ప్రధాని మండిపడ్డారు. ఈ కార్యక్రమం సందర్భంగా పీఎం-కిసాన్ కింద రైతుల ఖాతాల్లో 19వ విడత పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో వేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఎన్డీయే ప్రభుత్వం ఎంతో చేసిందని, కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా 9.8కోట్ల మంది రైతుల ఖాతాల్లో 19వ విడత పెట్టుబడి సాయం కోసం రూ.22వేల కోట్లు వేశామని ప్రధాని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం ప్రారంభించే ముందు ఆయన్ను తామరగింజలతో తయారు చేసిన దండతో సన్మానించారు. తామరగింజలు మంచి ఆహారం అని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో తాను తామరగింజలను దాదాపు రోజూ ఆహారంలో తీసుకుంటానని మోదీ చెప్పారు. బిహార్లో తామరగింజల ఉత్పత్తి బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించామని గుర్తు చేస్తూ తామరగింజలకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉందని చెప్పారు.
కాగా, మహా కుంభమేళాను విమర్శించేవారిపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటివారు రాబందులు, పందులు అని ప్రతి విమర్శ చేశారు. కుంభమేళాలో ఎవరు ఏది కోరుకుంటే అదే దొరుకుతుందని ఎద్దేవా చేశారు. ‘రాబందులకు శవాలు దొరుకుతాయి. పందులకు బురద దొరుకుతుంది. సున్నితమైన వ్యక్తులకు అద్భుతమైన సంబంధాలు దొరుకుతాయి. వ్యాపారులకు బేరాలు, భక్తులకు స్వచ్ఛమైన ఏర్పాట్లు ఉన్నాయి’ అని చెప్పారు.
‘నిర్వహణ లోపాల వల్ల హజ్లో తొక్కిసలాట జరిగితే లౌకిక మేధావులు ఎవరూ మాట్లాడలేదు. అలాంటివారే కుంభమేళా ఏర్పాట్లపై విమర్శలు చేస్తున్నారు. ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నా లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తూనే ఉన్నారు’ అని చెప్పారు. కుంభమేళాలో దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ భక్తుల విశ్వాసం, ఉత్సాహంలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు.
సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్పై విమర్శలు చేస్తూ వారిలాగా మతవిశ్వాసాలతో ఆడుకోబోమని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుంభమేళా ఏర్పాట్లను సక్రమంగా చేయలేదని ఆరోపించారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?