
ఈ క్రమంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఇటీవలి ద్వైపాక్షిక వాణిజ్యం రెండు దేశాల మధ్య సంబంధాలకు చారిత్రాత్మక నిర్ణయమని చెప్పవచ్చు. 50,000 టన్నుల పాకిస్తాన్ బియ్యాన్ని ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ అంగీకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో ఈ డీల్ ఖరారైంది.
ఈ క్రమంలో పాకిస్తాన్ నుంచి బియ్యం బంగ్లాదేశ్కు రెండు విడతలుగా పంపిణీ చేస్తారు. ఇందులో భాగంగానే పాక్ ప్రభుత్వ నౌక 25,000 టన్నుల తొలి సరుకుతో బంగ్లాదేశ్కు బయలుదేరింది. అదే సమయంలో దాని రెండో సరుకు మార్చి ప్రారంభంలో పంపించనున్నారు. పాకిస్తాన్ నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్కు చెందిన ఓడ ప్రభుత్వ సరుకుతో బంగ్లాదేశ్ నౌకాశ్రయంలోకి రావడం ఇదే మొదటిసారి.
అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఇది మొదటి సముద్ర రవాణా మాత్రం కాదు. గత సంవత్సరం కూడా పాకిస్తాన్ నౌక బంగ్లాదేశ్కు వస్తువులతో చేరుకుంది. అయితే గత సంవత్సరం వెళ్లిన ఓడ ఒక ప్రైవేట్ కంపెనీకి చెందినది. 1971 తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వ నౌక ప్రత్యక్ష సముద్ర రవాణా మార్గం ద్వారా బంగ్లాదేశ్కు చేరుకోవడం ఇదే తొలిసారి.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా