
చరిత్రలో తొలిసారిగా అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ పగ్గాలను ఓ భారత సంతతి నేత చేపట్టనున్నారు. ఎఫ్బీఐ డైరెక్టర్గా కశ్యప్ ‘కాష్’ పటేల్ ఎంపికను ఖరారు చేస్తు అమెరికా పెద్దల సభ సెనెట్ 51-49 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. రిపబ్లికన్ సెనెటర్లు అందరూ ఆయనకు మద్దతుగా నిలిచినా సుసన్ కోలిన్స్, లిసా ముర్కోవ్క్కీ మాత్రం మాత్రం డెమోక్రాట్ల పక్షం వహిస్తూ కాష్ పటేల్కు వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పటేల్, రాజకీయాలకు అతీతంగా ఎఫ్బీఐ పనిచేస్తుందని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులపై ఎటువంటి ప్రతీకార చర్యలు ఉండవని హామీ ఇచ్చారు. ఎఫ్బీఐపై ప్రజల్లో నమ్మకం మరింత పెంచడమే తన లక్ష్యమని చెప్పారు. అమెరికాకు హాని తలపెట్టే వారు ప్రపంచంలో ఏమూలన దాగి ఉన్నా వేటాడి మరీ మట్టుపెడతామని హెచ్చరించారు.
ఎఫ్బీఐని పారదర్శకంగా, జవాబుదారీతనంతో న్యాయానికి అంకితమయ్యే విధంగా చేస్తానని స్పష్టం చేశారు. అమెరికా ప్రజలు గర్వపడే విధంగా తీర్చిదిద్దుతానని భరోసా ఇచ్చారు. ఎక్స్ పోస్టులో పటేల్ ఇలా పేర్కొన్నారు: “ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తొమ్మిదవ డైరెక్టర్గా నేను నియమితుడవడం నాకు గౌరవంగా ఉంది. మీ అచంచల విశ్వాసం, మద్దతుకు అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ బోండికి ధన్యవాదాలు”.
డొనాల్డ ట్రంప్కు నమ్మినబంటుగా క్యాష్ పటేల్కు పేరుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచీ ప్రభుత్వ ప్రధాన శాఖల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. న్యాయశాఖ, ఎఫ్బీఐలో దాదాపు 75 మంది లాయర్లు, ఇతర అధికారులు ట్రంప్ అధికారం చేపట్టాక రాజీనామా చేశారు. వీరిలో కొందరిని ట్రంప్ ప్రభుత్వం స్వయంగా తొలగించగా మరికొందరిని ఇతర విభాగాలకు బదిలీ చేసింది.
కేవలం నెల వ్యవధిలో ఈ స్థాయిలో మార్పులు చోటుచేసుకోవడం అక్కడి వర్గాల్లో కలకలం రేపుతోంది. ట్రంప్ విధానాలను, లక్ష్యాలకు అనుగూణంగా తమ చర్యలు ఉంటాయని న్యాయ శాఖ నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అక్రమ వలసల విధానంలో ట్రంప్కు వత్తాసు పలికి ప్రతిపక్ష డెమోక్రటిక్ నేత, న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్పై అవినీతి కేసును ఎత్తేసేందుకు న్యాయశాఖ సిద్ధమైంది. న్యాయశాఖ పనితీరుపై డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తు్న్నారు. 2016 నాటి ఆయన ప్రచార కార్యక్రమాలు, మరో రెండు ఫెడరల్ క్రిమినల్ కేసులను న్యాయశాఖ ట్రంప్పై నమోదు చేసింది. అయితే, విచారణకు రాకమునుపే వాటిని పక్కన పెట్టేసింది. అయితే, తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లులేవని గతంలో ట్రంప్ కేసులపై పని చేసిన అధికారులు తెలిపారు.
More Stories
పాక్- సౌదీ రక్షణ ఒప్పందంపై భారత్ అధ్యయనం
అఫ్గానిస్థాన్ ఉగ్రస్థావరంగా మారకుండా చూడాలి
యాంటిఫా గ్రూపును ఉగ్రసంస్థగా ప్రకటించిన ట్రంప్