
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా నుంచి తరలిస్తున్న మధ్య ఆసియా, భారత అక్రమ వలసదారులను తమ దేశంలోకి తీసుకుంటున్నట్లు కోస్టారికా దేశం ప్రకటించింది.
‘అమెరికా నుంచి తరలిస్తున్న 200 మంది అక్రమ వలసదారులను తమ దేశంలోకి తీసుకొనేందుకు కోస్టారికా ప్రభుత్వం అంగీకరించింది. వీరిలో మధ్య ఆసియా, భారత్కు చెందిన వారు ఉన్నారు’ అని కోస్టారికా అధ్యక్షుడు రోడ్రిగో చావెస్ రోబుల్స్ కార్యాలయం అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. వారు తమ స్వదేశం చేరుకొనేందుకు తాము ఓ వారధిగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.
ఈ వలసదారులను ఓ కమర్షియల్ ఫ్లేట్ ద్వారా కోస్టారికాకు చేర్చుకొని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అక్రమ వలసదారుల శిబిరంలో ఉంచుతారు. మొదటి బృందం బుధవారం ఆ దేశంకు చేరుకుంటుంది. ఆ తర్వాత వారు తమ స్వదేశంకు వెడతారు. ఇది పనామా సరిహద్దు సమీపంలో ఉంది. పనామా, గ్వాటెమాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న మూడో దేశంగా కోస్టారికా నిలిచింది.
ఇప్పటికే పనామా తొలి బ్యాచ్లో చైనా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్కు చెందిన వలసదారులను తమ దేశంలోకి తీసుకోగా, గ్వాటెమాలా ఇంకా అమెరికా నుంచి వలసదారులను తరలించలేదు. అమెరికా నిధులతో జరిగే స్వదేశానికి తిరిగి పంపే ప్రక్రియను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఏం) పర్యవేక్షిస్తోంది. ఇది దేశంలో వలసదారులు బస చేసే సమయంలో వారి సంరక్షణను పర్యవేక్షిస్తుంది,
ఇక అమెరికా నుంచి భారత వలసదారులు పెద్ద ఎత్తున తిరిగి స్వదేశానికి వస్తున్నారు. ఇప్పటికే మూడు విమానాల్లో 332 మంది వలసదారులు భారత్కు చేరుకోగా, వెనక్కివచ్చిన వారి వివరాలను అధికారులు సేకరించి తమ స్వస్థలాలకు పంపిస్తున్నారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా